ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ప్రేమ జంటలు పెళ్లి బంధంతో ఒక్కటవ్వుతున్నాయి. ఇప్పుడు బాలీవుడ్ లో మరో ప్రేమ జంట పెళ్లి పీటలెక్కనుందని తెలుస్తోంది. గత ఏడాది నుంచి బాలీవుడ్ బ్యూటీ కియార అద్వానీ ప్రేమ వ్యవహారం పై వరుసగా ఊహాగానాలు వినిస్తూనే ఉన్నాయి. కియార బాలీవుడ్ టాలెంటెడ్ హీరో సిద్ధార్థ మల్హోత్రా తో ప్రేమలో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. తర్వాత వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని కూడా వార్తలు వచ్చాయి. అయితే దానిపై వీరు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా ఇప్పుడు వీరి పెళ్లి గురించి ఓ లేటెస్ట్ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. చండీగఢ్ లోనే వీరి పెళ్లి జరిపించాలని కుటుంబ సభ్యులు ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని వారి కుటుంబానికి అత్యంత సన్నిహితులే చెప్పారంటూ వార్తలు వెలువడుతున్నాయి. 


కియార-సిద్దార్థ జంటపై ఎప్పటినుంచో కథనాలు వస్తున్నాయి. మొన్నా మధ్యలో వీరిద్దరూ విడిపోయినట్టుగా కూడా కొన్ని వార్తలు వచ్చాయి. వీరి మధ్య విభేదాలు రావడంతో బ్రేకప్ చెప్పుకున్నారు అని టాక్ వినిపించింది. అయినప్పటికీ ఈ జంట ప్రైవేట్ పార్టీలలో అలాగే కొన్ని ప్రత్యేక వెకేషన్‌లలో కనిపిస్తూ ఉండడంతో ప్రేమలోనే ఉన్నారని తెలిసింది. ఇప్పుడు వీరి పెళ్లి వేదిక కూడా ఖరారు అయిందని వార్తలు వస్తున్నాయి. 


వచ్చే ఏడాది ప్రారంభంలోనే వీరి పెళ్లి జరగనుందని తెలుస్తోంది. ముందుగా పెళ్లిని కియార ఇష్టప్రకారం గోవాలో జరింపించాలి అనుకున్నారట. కానీ ఆ తర్వాత సిద్దార్థ కుటుంబ సభ్యుల కోరిక మేరకు చండీగఢ్ కు ప్లాన్ చేంజ్ చేసినట్టుగా తెలుస్తోంది. సిద్దార్థది పంజాబీ ఫ్యామిలీ కావడంతో అక్కడే వారి సంప్రదాయాల ప్రకారం పెళ్లి చేయాలని అనుకుంటున్నారట. వీరి పెళ్లి కి చండీగఢ్ లోని ది ఒబెరాయ్ సుఖ్ విల్లాస్ స్పా రిసార్ట్ వేదిక కానుందని టాక్. ఇది సిద్ధార్థ్ కుటుంబం ఉన్న ఢిల్లీ కి కూడా సమీపంలో ఉన్నందున ఈ రిసార్ట్ ను ఎంచుకుందట ఆయన ఫ్యామిలీ. 


అలాగే పెళ్లికి వచ్చే అతిథుల జాబితాను కూడా సిద్దం చేస్తున్నారట కియార జంట. ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమంది దర్శకులు, నిర్మాతలతో పాటు స్నేహితుల లో కొంత మంది సన్నిహితులను కూడా పెళ్లికి ఆహ్వానించాలని ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటి వరకూ ధృవీకరించబడిన పేర్లను బట్టి చూస్తే కరణ్ జోహార్, అశ్విని యార్డి వారితో పాటు వరుణ్ ధావన్, విక్కీ కౌశల్, కత్రినా కైఫ్, రకుల్ ప్రీత్, జాకీ భగ్నానితో పాటు పలువురు సెలబ్రెటీలను ఆహ్వానించనున్నట్లు సమాచారం. పెళ్లి తర్వాత కూడా అతిథుల కోసం ముంబై లో ప్రత్యేకంగా రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. 


ఇక కియార శంకర్ దర్శకత్వంతో తెరకెక్కుతోన్న ఆర్.సి 15 లో రామ్ చరణ్ సరసన నటిస్తోంది. ఇప్పటికే రామ్ చరణ్ ‘వినయ విధేయ రామ’ సినిమాలో హీరోయిన్ గా చేసింది కియార. వీరిద్దరూ జంటగా ఇది రెండో సినిమా. మరో వైపు సిద్దార్థ మల్హోత్ర నటించిన ‘యోథ’ సినిమా షూటింగ్ కూడా పూర్తయింది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. 



Read Also: క్యాన్సర్ ను జయించి మళ్లీ షూటింగ్స్ లో హంస నందిని బిజీ బిజీ!