మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR) నుంచి తాజాగా వచ్చిన 'దేవర' మూవీతో అభిమానులు సంతోషంగా ఉన్నారు. మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్ల ఊచకోత మాత్రం ఆగట్లేదు. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీపై ఆయన అభిమానుల కన్ను పడింది. ఈ సినిమాను ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు? స్టోరీ ఏంటి? అనే విషయాలపై సోషల్ మీడియా వేదికగా ఆరా తీస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రాబోతున్న ఈ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ లో హీరోయిన్ ఫిక్స్ అయినట్టుగా తెలుస్తోంది. అంతే కాకుండా సినిమా స్టోరీ ఇదేనంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది. మరి స్టోరీ ఏంటి? ఇందులో ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా నటించబోతున్న ఆ లక్కీ బ్యూటీ ఎవరు? అనే విషయాలను చూసేద్దాం పదండి. 


'ఎన్టీఆర్ 31'లో గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన కన్నడ భామ  
'దేవర' సీక్వెల్ కంటే ముందే ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ఒక ప్రాజెక్ట్ ఓకే అయ్యింది. ఇప్పటికే ఈ మూవీని లాంచ్ చేసి 'ఎన్టీఆర్ 31' అనే వర్కింగ్ టైటిల్ తో అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఆగస్టులో రామానాయుడు స్టూడియోలో 'ఎన్టీఆర్ 31' మూవీ లాంచింగ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ సినిమాను 2026 జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ చేయబోతున్నట్టు ముందుగానే అనౌన్స్ చేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా 'ఎన్టీఆర్ 31' మూవీలో హీరోయిన్ ఫిక్స్ అయ్యిందనే వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మరి ఎన్టీఆర్ తో స్క్రీన్ షేర్ చేసుకునే గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన ఆ హీరోయిన్ ఎవరు అంటే కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ (Rukmini Vasanth). ఈ అమ్మడు 'సప్త సాగరాలు దాటి' సినిమాతో కన్నాడలో పాపులర్ అయ్యింది. అలాగే తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకుంది. ఇప్పుడు ఏకంగా తారక్ తో రొమాన్స్ చేసే ఛాన్స్ కొట్టేసిందని అంటున్నారు. అయితే దీనిపై ఇంకా అఫీషియల్ గా అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. 


Read Also : Matka Release Date: 'మట్కా' రిలీజ్ డేట్‌పై అఫీషియల్ అనౌన్స్మెంట్... వరుణ్ తేజ్ బాక్సాఫీస్ బరిలోకి దిగేది ఎప్పుడంటే?



'ఎన్టీఆర్ 31' స్టోరీ ఇదేనా? 'దేవర'ను మించి.. 
ఇక హీరోయిన్ విషయంలో రుక్మిణి వసంత్ పేరు వినిపిస్తుంటే, సినిమా స్టోరీ ఇదే అంటూ నెట్టింట ఓ వార్త వైరల్ అవుతుంది. ఈ సినిమా మొత్తం బంగ్లాదేశ్ బ్యాక్ డ్రాప్ లో నడిచే స్టోరీతో సాగుతుందని ప్రచారం జరుగుతుంది. ఎన్టీఆర్ ఇందులో బంగ్లాదేశ్ కు వలస వెళ్ల కష్టాలు పడుతున్న తెలుగు వాళ్లకు అండగా నిలుస్తారని టాక్ నడుస్తోంది. ఈ స్టోరీ లైన్ వింటుంటే ప్రశాంత్ నీల్ తనదైన మార్క్ తో పాన్ ఇండియా ప్రేక్షకులకు రీచ్ అయ్యే స్టోరీని సిద్ధం చేశాడని, ఈ స్టోరీ 'దేవర'ను మించి ఉంటుందని ఇప్పటి నుంచే 'ఎన్టీఆర్ 31' మూవీపై అంచనాలు పెంచేస్తున్నారు తారక్ ఫ్యాన్స్. ఏదైతేనేం మూవీ ఇంకా షురూ కాకముందే ఇలాంటి రూమర్స్ తో 'ఎన్టీఆర్ 31'పై మంచి హైప్ క్రియేట్ అవుతోంది.  


Read Also : డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా ? బిగ్ బాస్ హౌస్ లో ఐదో వారం నామినేట్ అయిన కంటెస్టెంట్లు వీరే