గద్వాల్ జిల్లాకు చెందిన జైరాజ్ అనే వ్యక్తి మెగాహీరోలకు వీరాభిమాని. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ జన్మదిన వేడుకల్లో భాగంగా ఆయన వరిచిత్రాల్ని పండించారు .


గొర్లఖాన్ దొడ్డి పొలాల్లో రామ్ చరణ్ వరిచిత్రం: 


గద్వాల్ జిల్లా గట్టు మండలం గోర్లఖాన్ దొడ్డి ప్రాంతం లో పొలాల్ని కౌలుకు తీసుకొని రామ్ చరణ్ వరిచిత్రాన్ని వేయడం ప్రారంభించారు జైరాజ్. అంతెత్తునుంచి ఈ చిత్రాన్ని తీస్తే రామ్ చరణ్ చిత్తరువు స్పష్టంగా కనిపిస్తుంది. ఇందుకోసం మూడునెలల పాటు శ్రమపడ్డారు. జైరాజ్ వరినాట్లేసి బొమ్మను చిత్రీకరించారు. ప్రతి పుట్టినరోజు నాడు కొత్తగా ఏదో చేసి అభిమాన హీరోకి అంకితం చేయాలన్న తపనతో ఉన్న జైరాజ్ అభిమాని అంటే ఇలా ఉండాలనే విధంగా తనని తాను తీర్చి దిద్దుకుంటున్నారు.


పాదయాత్ర ద్వారా రామ్ చరణ్ తో కలయిక: 


తన ఊరినుంచి హైదరాబాద్ లోని రామ్ చరణ్ ఇంటిదాకా 264 కిలోమీటర్లు పాదయాత్ర చేసే మరి ఆయన్ని స్వయంగా కలుసుకున్నానంటూ జైరాజ్ చెబుతున్నారు. ఆయన్ని కలుసుకున్న క్షణాలు గుండెల్లో పెట్టుకుని భద్రపరుచుకున్నారంటున్నారు. అమ్మ నాన్న లేరని ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెబుతూ.. ఇప్పుడు రామ్ చరణ్ వరిచిత్రాన్ని పొలాల్లో పండించేందుకు వేల రూపాయలదాకా ఖర్చయిందన్నారు. యూస్ లో ఉన్న విజయ్ రేపల్లె గారు ఈ చిత్రాలు పండించేందుకు  అయ్యే ఖర్చును భరించారని జైరాజ్ చెప్పారు 


ఈ విషయం తెలుసుకున్న మెగా పవర్ రామ్ చరణ్ ఈ రోజు జైరాజ్ ని తన నివాసానికి పిలిపించుకుని సుమారు 45  నిమిషాలు మాట్లాడి అతనికి  ఆర్థిక సహాయం చేయడమేగాక అతని మేధస్సు మెచ్చుకుని సినీపరిశ్రమలో తగిన స్థానం కల్పిస్తామని మాట ఇవ్వడం విశేషం. ఈ సందర్భంగా జైరాజ్ మాట్లాడుతూ..  'మారుమూల గ్రామంలో ఉన్న నన్ను గుర్తించి నాకు ఇంత సప్పోర్ట్ చేస్తున్న శ్రీ రామ్ చరణ్ గారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను' అని తెలపడం జరిగింది.