మలయాళ సూపర్ హిట్ మూవీ ‘దృశ్యం’ తెలుగులో రీమేక్ అయిన సూపర్ హిట్టైంది. వెంకటేష్, మీనా ప్ర‌ధాన పాత్ర‌ల‌్లో శ్రీ ప్రియ ఈ మూవీని రీమేక్ చేసింది. ఆ తర్వాత దృశ్యం సీక్వెల్ గా మోహన్ లాల్ నటించిన  ‘దృశ్యం -2’  కూడా మంచి టాక్ తెచ్చుకోవడంతో...మాతృకకు దర్శకత్వం వహించిన జీతూ జోసఫ్ నే రీమేక్ కి ఎంపిక చేసుకున్నారు. మాతృక బాటలోనే అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. 


Also Read: అనుష్క స్లిమ్ గా ఎలా మారిందో తెలుసా..? ఇదిగో ఆమె డైట్ సీక్రెట్..


నవంబర్ 25 నుంచి ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోందని ప్రకటించారు.  తాజాగా 'దృశ్యం 2' ట్రైలర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ‘దృశ్యం’లో వెంకటష్ కేబుల్ టీవీ ఆపరేటర్ గా కనిపిస్తే ఈ సినిమాలో థియేటర్ ఓనర్ గా కనిపిస్తున్నాడు. అంతేకాదు నిర్మాతగా కూడా మారి సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్లు కనిపించాడు. వరుణ్ తల్లి గీతా ప్రభాకర్.. రాంబాబు కుటుంబంపై పగ తీర్చుకోవడానికి ప్రయత్నిస్తుంది. మరి దీని నుంచి రాంబాబు ఫ్యామిలీ ఎలా బయటపడిందనేది స్టోరీ. ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ స్వరాలు అందించారు. థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో కృతిక, ఎస్తర్ అనిల్ కీలకపాత్రలు పోషించారు. 


వెంకటేశ్ నటించిన మరో సినిమా ‘నారప్ప’ ఓటీటీలో విడుదల చేయడంతో పెద్ద దుమారం చెలరేగింది. ఊహించని విధంగా పంపిణీదారుల నుంచి సురేశ్ బాబు విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. 'దృశ్యం2' ను థియేట‌ర్స్‌లోనే విడుద‌ల అవుతుంద‌ని అంద‌రు అనుకున్నారు. కాని ఊహించ‌ని విధంగా ఓటీటీలో విడుద‌ల చేస్తున్నారు. 




Also Read: 'ఆర్ఆర్ఆర్', 'రాధే శ్యామ్'కు దారిస్తూ... వెనక్కి వెళ్లిన 'గంగూబాయి  కథియవాడి'


Also Read: సన్నీ & కో ని టార్గెట్ చేశారా... బిగ్ బాస్ హౌస్ లో పదకొండోవారం నామినేషన్ల హీట్


Also Read: విజేతగా నిలిచేది ఒక్కడే... ఆ ఒక్కడు నువ్వే ఎందుకు అవ్వాలి?... చెర్రీ వాయిస్‌తో అదిరిపోయిన గని టీజర్


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి