కోలీవుడ్ స్టార్ ధనుష్, రజనీకాంత్ కూతురు ఐశ్వర్య ఇటీవలే విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. అప్పట్నుంచి ధనుష్ సోషల్ మీడియాలో అస్సలు యాక్టివ్గా లేరు. విడిపోతున్నట్లు ట్వీట్ చేసిన అనంతరం తన కొత్త సినిమా ‘మారన్’ హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతున్నప్పుడు దానికి సంబంధించిన ఒక్క ట్వీట్ మాత్రం పెట్టారు. అయితే ఇప్పుడు ధనుష్ మరో ట్వీట్ చేశారు. అది కూడా ఐశ్వర్య గురించే కావడం విశేషం.
జానీ మాస్టర్, ఢీ ఫేం శ్రష్టి జంటగా ‘పయని’ అనే మ్యూజిక్ వీడియోకు ఐశ్వర్య దర్శకత్వం వహించారు. తమిళ వెర్షన్ను సూపర్ స్టార్ రజినీకాంత్ విడుదల చేయగా... తెలుగు వెర్షన్ ‘సంచారి’ని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మలయాళ వెర్షన్ ‘యాత్రక్కారి’ని మోహన్ లాల్ రిలీజ్ చేశారు. ఈ వీడియో గురించి ధనుష్ ట్వీట్ చేశారు.
‘పయని మ్యూజిక్ వీడియోకు దర్శకత్వం వహించినందుకు నా స్నేహితురాలు ఐశ్వర్యకు శుభాకాంక్షలు. గాడ్ బ్లెస్’ అని ఈ ట్వీట్లో పేర్కొన్నారు. అయితే విడిపోయాక కూడా ఐశ్వర్య తన ట్విట్టర్ యూజర్నేమ్లో ధనుష్ పేరును అలానే ఉంచేశారు. ధనుష్ చేసిన ట్వీట్పై అతని ఫ్యాన్స్ కూడా స్పందిస్తున్నారు. ‘తను ఇంకా నీ పేరును తీయలేదు. కానీ నువ్వు ఫ్రెండ్ అంటున్నావా?’, ‘మళ్లీ తిరిగి కలిసిపోండి’, ‘ఫ్రెండా అన్నయ్యా?’ ఇలా రకరకాలుగా ఈ ట్వీట్పై రియాక్ట్ అవుతున్నారు.
ఈ వీడియో గురించి సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ట్వీట్ చేశారు. ‘మళ్లీ దర్శకత్వం వహించినందుకు శుభాకాంక్షలు. ఈ పాటను పూర్తిగా ఎంజాయ్ చేశాను.’ అని మహేష్ బాబు ట్వీట్లో పేర్కొన్నారు. సంచారి, పయని, యాత్రక్కారి పేర్లతో విడుదల అయిన ఈ పాటలను యూట్యూబ్లో చూడవచ్చు.