కనిపించని రుక్మిణి గురించి కాదు ఇంట్లో ఉన్న సత్య గురించి పట్టించుకొమ్మని ఈశ్వరప్రసాద్ దేవుడమ్మకి హితబోధ చేస్తాడు. మీరు చెప్పింది నిజమే సత్య మనసులో ఎలాంటి కొదవ లేకుండా నేను చూసుకుంటాను అని దేవుడమ్మ అంటుంది. రుక్మిణి నిద్ర లేచేసారికి దేవి పక్కన ఉండదు. దేవమ్మ ఇంత పొద్దున్నే లేచి ఎక్కడికి వెళ్ళింది అని రుక్మిణి ఇల్లు మొత్తం దేవి కోసం వెతుకుతుంది కానీ ఎక్కడా తను కనిపించకపోయేసరికి కంగారు పడుతుంది. దేవిని చూశారా అని రుక్మిణి జానకిని అడుగుతుంది. ఇంట్లో బయట అంతా వెతికినా ఎక్కడా కనిపించలేదని చెప్తుంది. అప్పుడే మాధవ కూడా వస్తాడు, దేవి కనిపించడం లేదనే విషయం చెప్తారు. తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసి దేవి వచ్చిందా అని అడుగుతారు. రాత్రి నా పక్కన పడుకున్న బిడ్డ పొద్దున్నే ఎక్కడికి వెళ్ళింది, ఇలా జరిగిందని వెంటనే పెనిమిటికి ఫోన్ చేసి చెప్పాలని రుక్మిణి అనుకుంటుంది.


Also Read: నీ మనసులో నా స్థానం ఏంటని ఆదిత్యని నిలదీసిన సత్య- తన బతుకులో తన పెనిమిటే ఉన్నాడని మాధవకి వార్నింగ్ ఇచ్చిన రుక్మిణి


దేవి రుక్మిణి ఫోటో పట్టుకుని తిరుగుతూ ఉంటుంది. అమ్మ నాయన గురించి ఎంత అడిగినా చెప్పడం లేదు నాయన ఫోటో లేకపోతే ఏమి అమ్మ ఫోటో ఉంది కదా పక్క ఊరికి పోయి అమ్మ ఫోటో చూపించి అడుగుతాను. చిన్నమ్మని చూడగానే ఆఫీసర్ సారు భార్య అని ఎట్ల గుర్తు పడతారో అలాగే మాయమ్మ ఫోటో చూస్తే మా నాయన ఎవరో చెప్తారుగా అని దేవి ఊరంతా తిరుగుతూ అందరినీ అడుగుతూ ఉంటుంది. మాయమ్మ ఎట్లా ఉంటుందో దేవుడమ్మ అవ్వకి తెలియదు కదా ఈ ఫోటో అవ్వకి చూపించి మా నాయన గురించి ఏమైనా తెలుసా అని అడుగుతాడు. అవ్వ అయితే  ఆఫీసర్ సారు లెక్క చేస్తది అని దేవి అనుకుంటుంది. వెంటనే దేవుడమ్మ ఇంటికి బయల్దేరుతుంది. దేవి మీసాలు పెట్టిన ఫోటో చూసుకుంటూ నా బిడ్డకి నా పోలికలే వచ్చాయని సంబరపడుతూ ఉంటాడు ఆదిత్య అప్పుడే రుక్మిణి ఫోన్ చేసి ఇంట్లో దేవి కనిపించడం లేడని చెప్తుంది. బిడ్డ ఎక్కడికి వెళ్లిందో అర్థం కావడం లేదని బాధపడుతుంది. ఇద్దరూ కలిసి దేవి కోసం వెతుకుతూ ఉంటారు.


దేవి దేవుడమ్మ ఇంటికి వస్తుంది. కానీ ఇంట్లో ఎవ్వరూ లేకపోవడంతో నిరాశగా వెనక్కి వెళ్ళిపోతుంది. జానకి, రామూర్తి, మాధవ అందరూ రోడ్డు మీద పడి దేవి కోసం వెతుకుతూ ఉంటారు. అసలు దేవికి ఇంట్లో నుంచి వెళ్లాలని ఎందుకు అనిపించింది, ఆ పసిమనసుకి వచ్చిన బాధ ఏంటి అని రామూర్తి అంటాడు. దేవికి ఏదైనా జరిగితే రాధ గుండె పగిలిపోతుంది, దేవిని చూసుకుంటూ మన ఇంట్లో ఉంటుంది. ఇలా దేవి ఇంట్లో నుంచి వెళ్లిపోయావడం చూస్తుంటే ఇంక ఇక్కడ ఎందుకని రాధ ఇంట్లో నుంచి వెళ్లిపోయినా వెళ్ళిపోతుంది అని జానకి ఏడుస్తుంది. దేవి దేని గురించో బాధపడుతుంది, ఇంట్లో ఉండకుండా వెళ్లిపోతుందని రాధ కనిపించగానే ఇద్దరం కలిసే వెళ్లిపోదామని దేవి రాధని తీసుకుని వెళ్లిపోతే అని రామూర్తి భయపడతాడు.


Also Read: కాంచన గురించి ఇంట్లో చెప్పి మంట పెట్టిన మాళవిక- ఖైలాష్ ని యష్ విడిపిస్తాడా?


ఇక దేవి ఒక చోట ఫోటో పట్టుకుని ఒక వ్యక్తితో మాట్లాడుతూ ఉండటాన్ని ఆదిత్య, రుక్మిణి చూస్తారు. దేవి వాళ్ళని చూసి షాక్ అవుతుంది. రుక్మిణి ఏడుస్తూ దేవమ్మా అని పరిగెత్తుకుంటూ వెళ్ళి తనని హత్తుకుంటుంది. ఎక్కడికి వెళ్లిపోయావో తెలియక ఎంత అల్లడిపోయానో తెలుసా అని ఏడుస్తుంది. ఇలా ఇంట్లో నుంచి చెప్పకుండా వచ్చేస్తే ఎలాగమ్మా అని ఆదిత్య కంగారుగా అడుగుతాడు. మరి ఏం చెయ్యమంటారు సారు మా నాయన ఎక్కడ ఉన్నాడో  చెప్పమంటే మాయమ్మ చెప్పడం లేదు అని దేవి బాధగా అంటుంది.