మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Vishwak Sen) కొత్త సినిమా అనౌన్స్ చేశారు. న్యూ ఏజ్ ఫిలిమ్స్, యాక్షన్ మూవీస్‌తో ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్న ఆయన... ఈసారి ఫుల్ టు బిందాస్ అనేలా ఎంటర్‌టైన్‌మెంట్ అందించనున్నారు. ఇవాళ తన 14వ సినిమాను అనౌన్స్ చేశారు. 


'జాతి రత్నాలు' దర్శకుడితో విశ్వక్ సేన్ సినిమా!
KV Anudeep to direct Vishwak Sen: 'జాతి రత్నాలు' సినిమాతో తెలుగు ప్రజలను విపరీతంగా నవ్వించిన దర్శకుడు కేవీ అనుదీప్. దానికి ముందు 'పిట్టగోడ', ఆ తర్వాత కోలీవుడ్ స్టార్ శివ కార్తికేయన్ హీరోగా 'ప్రిన్స్' తీశారు. ఆయన సినిమాల్లో కామెడీ మాత్రమే కాదు... టీవీ షోస్, ఇంటర్వ్యూలలో ఆయన చెప్పే సమాధానాలు సైతం విపరీతంగా నవ్వించాయి. ఇప్పుడు ఆయన దర్శకత్వంలో విశ్వక్ సేన్ సినిమా అనడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడింది.  






పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో...
విశ్వక్ సేన్ కథానాయకుడిగా కేవీ అనుదీప్ దర్శకత్వం వహించనున్న సినిమాను అతి తక్కువ సమయంలో అగ్ర నిర్మాణ సంస్థల జాబితాలో చేరిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (People Media Factory) పతాకం మీద విజనరీ నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ ప్రొడ్యూస్ చేయనున్నారు.


Also Read: పనీ పాటా లేని పకోడీ గాళ్ళు... మిస్టర్ హరీష్ శంకర్ సెటైర్ ఎవరి మీద?



విశ్వక్ సేన్ - అనుదీప్ సినిమా గురించి నిర్మాణ సంస్థ ప్రతినిథులు మాట్లాడుతూ... ''హై ఎనర్జీ పెర్ఫార్మెన్స్‌ అంటే విశ్వక్ సేన్ గుర్తుకు వస్తారు. స్క్రీన్ మీద నటనతో అదరగొడతారు. హిలేరియస్ ఎంటర్‌టైనర్స్ రూపొందించడంలో కేవీ అనుదీప్ స్పెషలిస్ట్. వీళ్లిద్దరి కలయికలో సినిమా యూనిక్ స్టొరీ లైన్‌తో అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించనున్నాం. కేవీ అనుదీప్ సిగ్నేచర్ హ్యూమర్‌, విశ్వక్ సేన్ ఎనర్జీ అందర్నీ ఆకట్టుంటాయి'' అని చెప్పారు. ఈ చిత్రానికి టాలీవుడ్ టాప్ టెక్నీషియన్లు పని చేస్తున్నారని, త్వరలో నటీనటుల పేర్లతో పాటు మరిన్ని వివరాలు అనౌన్స్ చేస్తామని పేర్కొన్నారు.


Also Readతమన్నా డబుల్ బొనాంజా - బాలీవుడ్ కెరీర్‌కు కొత్త బిగినింగా? ఎండ్ కార్డా?



విశ్వక్ సేన్ కథానాయకుడిగా నటించనున్న సినిమా కథ: కెవి అనుదీప్ - మోహన్ సతో, ఛాయాగ్రహణం: సురేష్ సారంగం, నిర్మాణ సంస్థ: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, సహ నిర్మాత - వివేక్ కూచిభొట్ల, నిర్మాత: టీజీ విశ్వ ప్రసాద్, దర్శకత్వం: కేవీ అనుదీప్.


Also Readశివుడి మీద కాంట్రవర్సీ లేకుండా సినిమా - ముస్లిం దర్శకుడు అప్సర్ మీద ప్రశంసలు