'కలర్ ఫోటో’ చిత్రంతో టాలీవుడ్ కి హీరోగా పరిచయం అయ్యాడు సుహాస్. తొలి సినిమాతోనే నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమా ఏకంగా జాతీయ అవార్డును సైతం అందుకుంది. ఆ తర్వాత 'రైటర్ పద్మభూషణ్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా కూడా మంచి సక్సెస్ అందుకుంది. ముఖ్యంగా మహిళలను బాగా ఆకట్టుకుంది. హీరోగానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ రాణిస్తున్నాడు. రీసెంట్ టైమ్స్ లో వచ్చిన అడివి శేష్ 'హిట్ 2' చిత్రంలో నెగెటివ్ రోల్ పోషించి అలరించాడు.


ఇక ఇప్పుడు 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు' అనే సినిమాతో ప్రేక్షకుల ముందు రాబోతున్నాడు. కంప్లీట్ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రానికి దుష్యంత్ కటికనేని దర్శకత్వం వహించారు  ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, సాంగ్స్, టీజర్ మంచి రెస్పాన్స్ అందుకోగా.. ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింతగా పెంచేసింది. ఫిబ్రవరి 2న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ 'అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండు' సినిమా చూసి తన రివ్యూ ఇచ్చారు.






'అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండు' పై రౌడీ హీరో రివ్యూ..


రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఈ సినిమాని సపోర్ట్ చేస్తూ తాజాగా హైదరాబాదులో అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా బీఫ్ టికెట్ రిలీజ్ చేశారు ఇక ఈ సినిమాను చూసి చాలా బాగుందంటూ ప్రశంసించారు." అంబాజీపేట మ్యారేజి బ్యాండు సినిమా చూశాను. ఫస్ట్ హాఫ్ అద్భుతంగా ఉంది. మ్యూజిక్, ఆర్టిస్టుల పర్ ఫార్మెన్స్ లు నెక్ట్ లెవెల్ లో ఉన్నాయి. సుహాస్ ఎప్పటిలాగా చాలా బాగా నటించాడు. శరణ్య అద్భుతంగా పర్ ఫార్మ్ చేసింది. ఏ సినిమాకైనా ఫస్ట్ హాఫ్ చూశాక కొంత విరామం తీసుకునే నేను ఈ సినిమాకు కంటిన్యూగా ఫుల్ మూవీ చూశాను. అంత క్యూరియస్ గా అనిపించింది. మీరు కూడా థియేటర్ లో ఇదే ఫీల్ అవుతారు" అంటూ చెప్పుకొచ్చాడు. ఈ సినిమాపై రౌడీ హీరో కామెంట్స్ మరింత అంచనాలను పెంచాయి.


'అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండు' కాస్ట్ అండ్ క్రూ


కంప్లీట్ విలేజ్ నేటివిటీతో ఎమోషనల్ లవ్ స్టోరీ గా తెరకెక్కిన ఈ చిత్రంలో సుహాస్ సరసన శివాని నాగారం హీరోయిన్గా నటిస్తోంది. సీనియర్ నటుడు గోపరాజు రమణ, పుష్ప ఫ్రేమ్ జగదీష్ బండారి ఇతర కీలక పాత్రలు పోషించారు. గీతా ఆర్ట్స్ 2, మహాయణ మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎటాచ్మెంట్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. వెంకటేష్ మహా సమర్పకుడు. శేఖర్ చంద్ర సంగీతం అందించిన ఈ చిత్రానికి వాజిద్ బేగ్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు.


'ఫ్యామిలీ స్టార్' గా రాబోతోన్న విజయ్ దేవర కొండ..


'గీతా గోవిందం' మూవీ ఫేమ్ పరశురాం - విజయ్ దేవరకొండ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మృణాల్ ఠాగూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని ఏప్రిల్ లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.


Also Read : మగాళ్లకు సారీ చెప్పిన ప్రియమణి - ఎందుకో తెలుసా?