Chaari 111 Movie Release: వెండితెరపై కమెడియన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా తనదైన స్టైల్లో కామెడీ పండిస్తూ ఆడియన్స్‌ కడుపుబ్బా నవ్విస్తున్న వెన్నెల కిషోర్‌ హీరోగా పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే. తొలిసారి ఆయన హీరోగా నటించిన చిత్రం 'చారి 111'. 'మళ్ళీ మొదలైంది' మూవీ డైరెక్టర్‌ టీజీ కీర్తి కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని బర్కత్‌ స్టూడియోస్‌ పతాకంపై అదితి సోనీ నిర్మిస్తున్నారు. సంయుక్తా విశ్వనాథన్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. మురళీ శర్మ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ సినిమా ప్రచార పోస్టర్స్‌ పాజిటివ్‌ రెస్పాన్స్‌ అందుకున్నాయి.


ముఖ్యంగా ఇటీవల రిలీజైన కాన్సెప్ట్ టీజర్‌కు విశేష స్పందన లభించింది. దీంతో మూవీ అంచనాలు నెలకొన్నాయి. కమెడియన్‌ వినోదాన్ని పండించిన వెన్నెల కిషోర్‌ హీరో ఎలా మెప్పించనున్నాడనే క్యూరియసిటీ నెలకొంది. దీంతో మూవీ అంచాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో తాజాగా చిత్ర యూనిట్‌ మూవీ రిలీజ్‌ డేట్‌ను ప్రకటించింది. చారి 111 మూవీని మార్చి 1వ తేదీన విడుదల చేయబోతున్నట్టు తాజాగా ఆఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ ఇచ్చారు మేకర్స్‌. ఈ సందర్భంగా రిలీజ్‌ చేసిన రిలీజ్‌ పోస్టర్‌ ఆకట్టుకుంటుంది. ప్రేక్షకుల్లో క్యూసియాసిటీ కలిగించే విధంగా ప్రత్యేకంగా డిజైన్ చేశారు.



థియేటర్లలోకి గూఢచారిగా ప్రేక్షకుల్ని నవ్వించడానికి 'వెన్నెల' కిశోర్ వస్తున్నట్లు ఉంది. ఈ జనరేషన్ కమెడియన్లలో తనకంటూ సపరేట్ కామెడీ స్టైల్ క్రియేట్ చేసుకున్న ఆయన.. ఈ సినిమాలో ఏ విధంగా నవ్విస్తారో థియేటర్లలో చూడాలి. రిలీజ్‌ డేట్‌ ప్రకటించిన సందర్భంగా మూవీ దర్శకుడు టీజీ కీర్తి కుమార్‌ మాట్లాడారు. "ఇదొక స్పై యాక్షన్ కామెడీ సినిమా. సిల్లీ మిస్టేక్స్ చేసే ఒక స్పై పెద్ద కేసును ఎలా సాల్వ్ చేశాడనేది సినిమా. వెన్నెల కిశోర్, సంయుక్తా విశ్వనాథన్ స్పై రోల్స్ చేశారు. వాళ్లకు బాస్ రోల్ మురళీ శర్మ చేశారు. కథలో ఆయనది కీలక పాత్ర" అని చెప్పారు.


Also Read: ఇంట్లో ఒత్తిడి.. మళ్లీ పెళ్లికి సిద్ధమైన సమంత? - బంధువుల అబ్బాయితో పెళ్లట!


ఆ తర్వాత నిర్మాత అదిఇ సోనీ మాట్లాడుతూ.. స్పై జానర్ సినిమాల్లో 'చారి 111' కొత్తగా ఉంటుంది. 'వెన్నెల' కిశోర్ గారి నటన, టీజీ కీర్తి కుమార్ దర్శకత్వం సినిమాకు హైలైట్ అవుతాయి. మార్చి 1న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. అతి త్వరలో ట్రైలర్, పాటలు విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం" అన్నారు.  కాగా ఈ మూవీ పాటలను ఆదిత్య మ్యూజిక్‌ విడుదల చేయనుంది. 'వెన్నెల' కిశోర్, సంయుక్తా విశ్వనాథన్, మురళీ శర్మ, బ్రహ్మాజీ, సత్య, రాహుల్ రవీంద్రన్, పావని రెడ్డి, 'తాగుబోతు' రమేష్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా.. సైమన్‌ కె కింగ సంగీతం అందిస్తున్నారు.