Venkatesh Daggubati Instagram Story: ఈరోజుల్లో ఎవరి పర్సనల్ లైఫ్ అయినా ఎలా ఉందో తెలుసుకోవడానికి వారి సోషల్ మీడియా చూస్తే చాలు.. ముఖ్యంగా సినీ సెలబ్రిటీలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవాటికి నెటిజన్లు నానార్థాలు వెతుకుతూ ఉంటారు. వారి పర్సనల్ లైఫ్‌లో ఏదో జరిగిందని అందుకే ఇలా పోస్ట్ చేశారని ఫిక్స్ అయిపోతుంటారు. ప్రస్తుతం సీనియర్ హీరో వెంకటేశ్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసే కోట్స్ గురించి కూడా నెటిజన్లు చర్చించుకోవడం మొదలుపెట్టారు. తాజాగా ఆయన పెట్టిన స్టోరీ చూస్తుంటే ఎవరికో ఇన్‌డైరెక్ట్‌గా చెప్తున్నట్టే ఉందని భావిస్తున్నారు. కానీ ఆయన ఫ్యాన్స్ మాత్రం వెంకీ మామకు అలాంటి కోట్స్ షేర్ చేయడం అలవాటే అంటున్నారు.


జడ్జ్ చేయకండి..


తాను నమ్మే సిద్ధాంతాలకు సూట్ అవుతాయని అనిపించిన కోట్స్ అన్నింటిని తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంటారు వెంకటేశ్. ఎప్పుడు చూసిన ఆయన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఏదో ఒక కొటేషన్ కనిపిస్తూనే ఉంటుంది. తన పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ విషయాలను షేర్ చేసినా చేయకపోయినా ఇలాంటివి మాత్రం రెగ్యులర్‌గా షేర్ చేస్తుంటారు. తాజాగా అలాంటి ఒక కొటేషనే షేర్ చేశారు. ‘‘పూర్తి కథ తెలియకుండా ఎవరినీ జడ్జ్ చేయకండి. మీకు అన్ని అర్థమవుతాయని అనిపించినా అర్థం కావు’’ అంటూ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీని పోస్ట్ చేశారు వెంకీ మామ. దీంతో వెంకటేశ్.. ఇన్‌డైరెక్ట్‌గా ఎవరికో కౌంటర్ ఇస్తున్నట్టుగా ఉందని కొందరు నెటిజన్లు ఫీలవుతున్నారు.


హ్యాట్రిక్ మూవీ..


టాలీవుడ్ సీనియర్ హీరోల్లో మిస్టర్ కూల్ అంటే చాలామంది వెంకటేశ్ పేరే చెప్తారు. అందుకే ఫ్యాన్స్ అంతా తనను ప్రేమగా వెంకీ మామ అని పిలుచుకుంటారు. ఇక సినిమాల విషయానికొస్తే.. తనకు ఇప్పటికే రెండు హిట్స్ ఇచ్చిన అనిల్ రావిపూడితో హ్యాట్రిక్‌కు సిద్ధమయ్యారు వెంకటేశ్. ఇప్పటికే ఈ మూవీ గురించి ఇచ్చిన అనౌన్స్‌మెంట్ ప్రేక్షకులను హ్యాపీ చేసింది. ముందుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఎఫ్ 2’.. చాలాకాలం తర్వాత వెంకీలోని కామెడీ యాంగిల్‌లో మరోసారి బయటపెట్టింది. ఆ తర్వాత వచ్చిన ‘ఎఫ్ 3’ కూడా అదే రేంజ్‌లో హిట్ అయ్యింది. అందుకే ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి.


షూటింగ్ స్టార్ట్..


ప్రస్తుతం అనిల్ రావిపూడి, వెంకటేశ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రానికి ‘వెంకీ అనిల్ 3’, ‘ఎస్వీసీ 58’ అనే వర్కింగ్ టైటిల్స్‌ను ఫిక్స్ చేశారు. ఇది ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీతో తెరకెక్కే క్రైమ్ థ్రిల్లర్ అని మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు. ఈ మూవీలో వెంకటేశ్ సరసన ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవల ఈ సినిమాను పూజా కార్యక్రమంతో లాంచ్ చేశారు. పూజా కార్యక్రమం గురించి అప్డేట్‌తో పాటు ఒక పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఆ పోస్టర్‌లో గన్, గులాబీ.. తాళితో కట్టి ఉంటుంది. దీంతో ఈసారి వెంకటేశ్‌తో అనిల్ రావిపూడి ఏదో కొత్తగా ప్లాన్ చేశాడని ప్రేక్షకులు ఫీలవుతున్నారు.


Also Read: ‘జనక అయితే గనక’ టీజర్ - పిల్లల స్కూల్ ఫీజులపై సుహాస్ సెటైర్ - స్మశానానికి, ఎల్‌కేజీకి లింకేంటీ?