టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఉస్తాద్ హీరో రామ్ కాంబినేషన్ మరోసారి ప్రేక్షకులను అలరించబోతున్న విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబోలో వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్' బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ అందుకుంది. అలాగే అప్పటివరకు ప్లాప్స్ లో ఉన్న పూరి జగన్నాథ్ కి ఈ సినిమా భారీ కం బ్యాక్ ఇచ్చింది. ఇక మరోసారి ఈ కాంబో ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా 'డబుల్ ఇస్మార్ట్' అంటూ కలిశారు. పూరి కనెక్ట్స్ బ్యానర్ పై పూరి జగన్నాథ్, ఛార్మి కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక నిన్న ఈ సినిమాకు సంబంధించి లాంచ్ ఈవెంట్ కూడా జరిగింది. కొంతమంది ప్రత్యేక అతిధుల సమక్షంలో ఈ ఈవెంట్ జరగగా.. చార్మి క్లాప్ కొట్టింది. రామ్ పై చిత్రీకరించిన తొలి సన్నివేశానికి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించారు.


ఇక ముహూర్తపు షాట్లో "ఇస్మార్ట్ శంకర్ అలియాస్ డబుల్ ఇస్మార్ట్" అని రామ్ చెప్పిన డైలాగ్ కూడా ఆకట్టుకుంది. జూలై 12 నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ముంబైలో స్టార్ట్ కానున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ క్రమంలోనే తాజాగా హీరో రామ్ 'డబుల్ ఇస్మార్ట్' కోసం పూర్తిగా మేకవర్ అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోని ఛార్మి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ హీరో రామ్ కి హెయిర్ కట్ చేశారు. ఇస్మార్ట్ శంకర్ హెయిర్ స్టైల్ కి మించి ఈ సినిమాలో రామ్ మేకోవర్ ఉండబోతుందని తాజా వీడియోతో స్పష్టం చేశారు. ఇక ఈ వీడియోను షేర్ చేస్తూ.. "ఇస్మార్ట్ శంకర్ వచ్చేసాడు. ఇది డబుల్ ఇస్మార్ట్ టైం. రేపు ముంబైలో షూటింగ్ కోసం అంతా సిద్ధం" అంటూ పలు ఆసక్తికర పోస్టులు పెట్టింది.


ఛార్మి షేర్ చేసిన లేటెస్ట్ వీడియోలో  రామ్ మేకోవర్ అదిరిపోయిందనే చెప్పాలి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ గా మారుతుంది. దర్శకుడు పూరి జగన్నాథ్ ఈసారి రామ్ ని మరింత మాస్ క్యారెక్టర్ లో ప్రజెంట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. కాగా 'ఇస్మార్ట్ శంకర్' మూవీ రామ్ తో పూరి జగన్నాథ్ కెరీర్ కి చాలా ప్రత్యేకమైన సినిమా. ఎందుకంటే ఈ సినిమాకి వచ్చినంత రెస్పాన్స్ ఇద్దరికీ మరే సినిమాకి రాలేదు. దీంతో ఇప్పుడు రాబోతున్న సీక్వెల్ 'డబుల్ ఇస్మార్ట్' ప్రాజెక్ట్ పై అంచనాలు భారీగా నెలకొన్నాయి. పూరి జగన్నాథ్ ఈ సీక్వెల్ కోసం చాలా పెద్ద స్పాన్ కలిగిన కథను ప్రిపేర్ చేసినట్లు సమాచారం. ఈ కథని అత్యున్నత స్థాయి సాంకేతిక ప్రమాణాలతో భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు.


రీసెంట్గా పూరి జగన్నాథ్ తెరకెక్కించిన 'లైగర్' బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలవడంతో ప్రస్తుతం పూరీ ఆశలన్నీ ఈ ప్రాజెక్టు పైనే ఉన్నాయి. ఈ సినిమాలో హీరోయిన్ ఇతర నటీనటుల వివరాలను మూవీ టీం త్వరలోనే అనౌన్స్ చేయనుంది. ఈసారి 'డబుల్ ఇస్మార్ట్' ప్రాజెక్ట్ ని పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని తెలుగుతోపాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో మార్చి 8, 2024 మహాశివరాత్రికి విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారిక ప్రకటన చేశారు.


Also Read : రజినీకాంత్ కూతురు రెండో పెళ్లి? ఆ యువ హీరోతో ప్రేమాయణం?




Join Us on Telegram: https://t.me/abpdesamofficial