Trisha Chiranjeevi: చెన్నై బ్యూటీ త్రిష తెలుగులో చాలా కాలం తర్వాత స్ట్రెయిట్ మూవీ చేస్తోంది. ప్రజెంట్ కోలీవుడ్లో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన 'విశ్వంభర' మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. మెగాస్టార్ తో అప్పుడెప్పుడో 'స్టాలిన్' సినిమాలో నటించిన త్రిష.. మళ్లీ ఇన్నేళ్ళ తర్వాత 'విశ్వంభర' సినిమాలో జోడి కడుతుండడంతో మరోసారి ఈ జంటను బిగ్ స్క్రీన్ పై చూసేందుకు ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రీసెంట్ గానే త్రిష ఈ మూవీ సెట్స్ లో జాయిన్ అయిన విషయం తెలిసిందే. ఇటీవలే చిరు, త్రిషలపై ఓ సాంగ్ కూడా షూట్ చేసినట్లు తెలిసింది. ప్రస్తుతం చిరంజీవి, త్రిష ఇద్దరు షూటింగ్లో బిజీగా ఉన్నారు. అయితే ఈ మూవీ షూటింగ్ గ్యాప్ లో. త్రిషకి చిరంజీవి స్పెషల్ గిఫ్ట్ పంపించారు. ఈ విషయాన్ని త్రిష స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. 


త్రిష కి మెగాస్టార్ స్పెషల్ గిఫ్ట్


మెగాస్టార్ చిరంజీవి తనకి ఓ స్పెషల్ గిఫ్ట్ పంపారని త్రిష తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. తనకోసం ఒక టెంపరేచర్ కంట్రోల్ ఫ్యాన్సీ మగ్ ని పంపినట్లు త్రిష తన ఇన్ స్టా స్టోరీలో పేర్కొంటూ తన ఆనందాన్ని వ్యక్తపరిచింది. అంతేకాదు అందుకు సంబంధించిన ఫోటోను షేర్ చేసింది." సో ఫ్యాన్సీ.. చిరు సార్, మీరు పంపించిన టెంపరేచర్ కంట్రోల్డ్ మగ్ నాకు చాలా ఇష్టం. థాంక్యూ.." అంటూ తన పోస్టులో రాసుకోస్తూ మెగాస్టార్ ని ట్యాగ్ చేసింది. దీంతో త్రిష పెట్టిన ఈ పోస్ట్ సోషల్ మీడియా అంతటా వైరల్ అవుతుంది.




8 ఏళ్ల తర్వాత తెలుగులో రీ ఎంట్రీ


త్రిష తెలుగులో చివరగా 'నాయకి' అనే సినిమా చేసింది. ఇది లేడీ ఓరియంటెడ్ ఫిలిమ్. 2016లో ఈ సినిమా రిలీజ్ అయింది. కానీ ఆశించిన రిజల్ట్ అందుకోలేకపోయింది. దాంతో టాలీవుడ్ కి గుడ్ బై చెప్పి కోలీవుడ్ పై ఫోకస్ పెట్టింది. అక్కడ వరుస సినిమాలతో బిజీ అవుతూ ఇటీవల కాలంలో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంది. ఇక 'విశ్వంభర'తో ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ త్రిష టాలీవుడ్ కి రీ ఎంట్రీ ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమా సక్సెస్ అయితే త్రిష మళ్లీ టాలీవుడ్ లో హీరోయిన్ గా బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయి.


త్రిషతో పాటూ మరో ఐదుగురు హీరోయిన్లు


'విశ్వంభర' సినిమాలో త్రిష తో పాటు మరో ఐదుగురు హీరోయిన్లు ప్రత్యేక పాత్రలు పోషిస్తున్నారు. ఆ ఐదుగురు హీరోయిన్స్ సినిమాలో చిరంజీవికి చెల్లెలుగా కనిపిస్తారని సమాచారం. ఈ సినిమాలో సోషియో ఫాంటసీ ఎలిమెంట్స్ తో పాటు సిస్టర్ సెంటిమెంట్ కూడా ఉంటుందట. ఇందులో చిరంజీవి చెల్లెలి పాత్రల్లో సురభి, ఆశిక రంగనాథ్, ఇషా చావ్లా, మృణాల్ ఠాకూర్, మీనాక్షి చౌదరి నటిస్తున్నట్లు తెలుస్తోంది. భారీ కాస్టింగ్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ UV క్రియేషన్స్ సుమారు రూ.200 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.


Also Read : 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్డేట్ - మెగాస్టార్ తో పాటూ డ్యూయల్ రోల్ లో ఆ హీరోయిన్?