Committee Kurrollu Gains Acclaim: సూపర్ స్టార్ మహేష్ బాబు ఎవరి సినిమా సక్సెస్ అయినా సంతోషిస్తారు. చిన్న పెద్ద తేడాలు లేకుండా ప్రతి ఒక్కరికీ కంగ్రాట్స్ చెప్పడంలో ముందు ఉంటారు. అంతా కొత్త వాళ్లతో మెగా డాటర్ నిహారిక కొణిదెల (Niharika Konidela) నిర్మించిన 'కమిటీ కుర్రోళ్ళు' ఫిల్మ్ సక్సెస్ సాధించిందని తెలిసి చిత్ర బృందాన్ని అభినందిస్తూ ఆయన ఓ ట్వీట్ చేశారు. త్వరలో సినిమా చూస్తానని చెప్పారు. ఇంతకీ, ఆయన ఏమన్నారంటే?


కంగ్రాచ్యులేషన్స్ నిహారిక కొణిదెల!
Mahesh Babu looking forward to watch Committee Kurrollu soon: ''కమిటీ కుర్రోళ్ళు' గురించి గొప్ప విషయాలు వింటున్నాను. సినిమా బావుందని చెబుతున్నారు. నిర్మాతగా నిహారిక కొణిదెల తొలి సినిమా ఇది. ఈ విజయం సాధించిన ఆమెకు, చిత్ర బృందానికి కంగ్రాచ్యులేషన్స్. త్వరలో ఈ సినిమా చూడాలని అనుకుంటున్నాను'' అని మహేష్ బాబు ట్వీట్ చేశారు. ఆయనకు పింక్ ఎలిఫాంట్ పిక్చర్స్ సంస్థ థాంక్స్ చెప్పింది. సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ సైతం ఆదివారం నిహారికతో పాటు 'కమిటీ కుర్రోళ్ళు' చిత్ర బృందానికి కంగ్రాట్స్ చెప్పారు.


Also Readపక్కోడు... పకోడీలు... పట్టించుకుంటే పనులు జరగవ్ - రామ్ సెన్సేషనల్ కామెంట్స్










కమిటీ కుర్రోళ్ళు... రెండు రోజుల్లో 3.69 కోట్ల వసూళ్లు!
Committee Kurrollu Collection Worldwide: 'కమిటీ కుర్రోళ్ళు' సినిమాకు క్రిటిక్స్ నుంచి మంచి రివ్యూస్ వచ్చాయి. ఆడియన్స్ కూడా సినిమా బావుందని ట్వీట్స్, పోస్టులు చేస్తున్నారు. బాక్సాఫీస్ బరిలో కూడా సినిమాకు మంచి స్పందన లభించింది. రెండు రోజుల్లో ఈ సినిమా 3.69 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఆదివారం కలెక్షన్స్ సైతం బావున్నాయి. మరికొన్ని గంటల్లో అనౌన్స్ చేయనున్నారు.


Also Read: 'లైగర్' ఫ్లాప్... పూరికి రాజమౌళి తండ్రి ఫోన్... స్టేజి మీద ఎమోషనలైన డైరెక్టర్!



యదు వంశీ దర్శకుడిగా పరిచయమైన 'కమిటీ కుర్రోళ్ళు' సినిమాలో పదకొండు మంది హీరోలు, నలుగురు హీరోయిన్లు ఉన్నారు. అందరూ చక్కగా నటించారని పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా సంగీత దర్శకుడు అనుదీప్ దేవ్ పాటలు, నేపథ్య సంగీతానికి ప్రశంసలు లభిస్తున్నాయి.