Kollywood Star In Megastar's Vishwambhara : స్టార్ హీరోల సినిమాల్లో ఇతర భాషల నటీనటులు నటిస్తుండడం ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో ఒక ట్రెండ్ అయిపోయింది. ముఖ్యంగా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ విషయంలో ఇది ఎక్కువగా జరుగుతూ వస్తోంది. ఇప్పుడు తాజాగా మెగాస్టార్ కొత్త సినిమాలోనూ ఓ తమిళ స్టార్ హీరో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఆ తమిళ స్టార్ హీరో ఎవరు? అనే వివరాల్లోకి వెళితే...


'విశ్వంభర' లో కోలీవుడ్ స్టార్ హీరో


మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'విశ్వంభర' లో కోలీవుడ్ స్టార్ హీరో శింబు ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు తాజా సమాచారం. సినిమాలో శింబు నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కోలీవుడ్ నుంచి విజయ్ సేతుపతి, ఆర్య వంటి హీరోలు తెలుగు సినిమాల్లో విలన్ గా మెప్పించారు. అల్లు అర్జున్ నటించిన 'వరుడు' సినిమాలో ఆర్య విలన్ గా అదరగొట్టగా.. రీసెంట్ టైమ్స్ లో వచ్చిన 'ఉప్పెన' లో విజయ్ సేతుపతి కూడా నెగిటివ్ రోల్ లో మెప్పించారు. ఇక ఇప్పుడు శింబు కూడా మెగాస్టార్ 'విశ్వంభర' లో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నట్లు చెబుతున్నారు. అయితే శింబు ఇందులో మెయిన్ విలన్ గా చేస్తున్నారా? లేక నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ చేస్తున్నారా? అనేది ఇంకా తెలియాల్సి ఉంది.


'విశ్వంభర' షూటింగ్ తో మెగాస్టార్ బిజీ అయ్యేది అప్పుడే..


'విశ్వంభర' సినిమాని మొదలుపెట్టి చాలా రోజులు అవుతోంది. ఇటీవల ఓ షెడ్యూల్ కూడా కంప్లీట్ చేశారు. కాకపోతే ఆ షెడ్యూల్ లో చిరంజీవి పాల్గొనలేదు. ఇక తాజా సమాచారం ప్రకారం ఫిబ్రవరి మొదటి వారంలో చిరంజీవి 'విశ్వంభర' షూటింగ్లో జాయిన్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్లో చిరంజీవి, హీరోయిన్ మధ్య కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తారని టాక్ వినిపిస్తోంది. అయితే ఇప్పటివరకు సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయంపై మూవీటీమ్ క్లారిటీ ఇవ్వలేదు. గత కొద్ది రోజులుగా ఇందులో చిరు సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వచ్చే నెలలోనే హీరోయిన్ విషయమై మేకర్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది.


భారీ ధరకు 'విశ్వంభర' ఓవర్సీస్ రైట్స్


'విశ్వంభర' ఓవర్సీస్ రైట్స్ 18 కోట్ల రూపాయలకు అమ్ముడైనట్లు తెలిసింది. మెగాస్టార్ చిరంజీవి కెరీర్ మొత్తంలో ఓ సినిమాకు ఓవర్సీస్ హక్కుల ద్వారా ఇంత మొత్తం రావడం ఇదే మొదటిసారి. సీనియర్ హీరోలలో రూ.15 కోట్లకు పైగా ఓవర్సీస్ రైట్స్ అమ్ముడవ్వడం ఇప్పటివరకు జరగలేదు. ఇది కేవలం మెగాస్టార్ సినిమాకి మాత్రమే సాధ్యమైంది. 'బింబిసార' మూవీ ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కునున్న ఈ సినిమా సోషియో ఫాంటసీ బ్యాక్ డ్రల్ లో ఉండబోతోంది. ఈ సినిమాను యువీ క్రియేషన్స్ సంస్థ సుమారు రూ. 200 కోట్లతో తెరకెక్కించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని 2025 సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.


Also Read : ‘ఎర్రచీర’ ట్రైలర్ - హర్రర్ మూవీలో యాక్షన్ మసాలా