Shobu Yarlagadda New Movie: ‘బాహుమలి‘ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నిర్మాత శోభు యార్లగడ్డ. ఆర్కా మీడియా వర్క్స్ సంస్థ ద్వారా మరో రెండు సినిమాలను నిర్మించబోతున్నట్లు తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా మూవీ పోస్టర్స్ ను రిలీజ్ చేశారు. ఇందులో ఒకటి ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్‘ కాగా, మరొక మూవీ ‘ఆక్సీజన్‘. ఈ రెండు పోస్టర్లను షేర్ చేస్తూ శోభు పలు కీలక విషయాలు వెల్లడించారు.


రెండు సినిమాలను ప్రకటించిన శోభు యార్లగడ్డ


తమ నిర్మించబోయే రెండు చిత్రాలు ప్రేక్షకులకు మంచి వినోదాన్ని కలిగించడంతో పాటు చక్కటి వ్యక్తులను సినిమా పరిశ్రమకు పరిచయం చేయబోతున్నట్లు తెలిపారు శోభు యార్లగడ్డ. “మేము ఈ రెండు చిత్రాలను ప్రకటించినప్పుడు మా మదిలో చాలా ఆలోచనలు వచ్చాయి. మల్టీ టాలెంటెడ్ ఫాహద్ ఫాసిల్ తో కలిసి పని చేయడం చాలా సంతోషంగా ఉంది. ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తుంది. రెండో ప్రాజెక్ట్ ‘ఆక్సీజన్’ కూడా చాలా అద్భుతమైనది. ఈ రెండు సినిమాల ద్వారా ఇద్దరు ప్రతిభావంతులైన దర్శకుడు శశాంక్, సిద్ధార్థని పరిచయం చేస్తున్నాం. అంతేకాదు, ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కార్తికేయతో కలిసి ఈ సినిమాల్లో భాగస్వామిగా ఉండబోతున్నాను. ఈ కలయిక సుదీర్ఘ ప్రయాణానికి నాందిగా భావిస్తున్నాను” అని శోభు యార్లగడ్డ వెల్లడించారు. దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి సమర్పణలో ఈ రెండు సినిమాలకు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.


రెండు సినిమాలు- నాలుగు భాషల్లో విడుదల


‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ సినిమా త్వరలో షూటింగ్ మొలుకానున్నట్లు తెలిపారు. ఈ చిత్రానికి శశాంక్ ఏలేటి కథ అందించడంతో పాటు దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్ లో శోభుయార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, ఎస్ఎస్ కార్తికేయ నిర్మిస్తున్నారు. త్వరలో సినిమా షూటింగ్ మొదలు కానుంది. తెలుగు, తమిళం, మలయాళంతో పాటు కన్నడలో తెరకెక్కనున్న ఈ సినిమా 2025లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అటు ‘ఆక్సిజన్’ సినిమాకు సిద్దార్థ నాదెళ్ల కథను అందించడంతో పాటు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా కూడా నాలుగు సౌత్ భాషల్లో తెరకెక్కనుంది. శోభు, ప్రసాద్, కార్తికేయ నిర్మాతలుగా ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్ లో రూపొందనుంది. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ సినిమాకు వేద వ్యాస్ గొట్టిపాటి సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. కాల భైరవ సంగీతాన్ని అందిస్తున్నారు. నిరంజన్ దేవరమనే ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహించనున్నారు. ఈ రెండు సినిమాలకు సంబంధించిన నటీనటులతో పాటు ఇతర వివరాలు త్వరలోనే అధికారికంగా వెల్లడయ్యే అవకాశం ఉంది. పెద్ద నిర్మాణ సంస్థ నుంచి వస్తున్న ఈ రెండు సినిమాలపై ప్రేక్షకలలో భారీగా అంచనాలు నెలకొన్నాయి.  






Read Also: హై యాక్షన్‌లో జాన్ అబ్రహం, అమాయక పాత్రలో తమన్నా- ఆకట్టుకుంటున్న ‘వేదా‘ టీజర్