Shambhala Makers Reunite For New Project With Sundeep Kishan : గతేడాది డిసెంబర్‌లో వచ్చిన సూపర్ నేచరల్ థ్రిల్లర్ 'శంబాల' బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆది సాయి కుమార్ హీరోగా యుగంధర్ ముని ఈ మూవీకి దర్శకత్వం వహించారు. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభిమోజు నిర్మించారు.

మరోసారి హిట్ కాంబో

ఇప్పుడు మరోసారి ఈ మేకర్స్ జత కట్టబోతున్నారు. షైనింగ్ పిక్చర్స్ డైరెక్టర్ యుగంధర్ మునితో మళ్లీ జత కట్టబోతున్నారు. వీరిద్దరి కాంబోలో ఇది రెండో ప్రాజెక్ట్. ఈసారి సోషియో ఫాంటసీ మూవీతో ఆడియన్స్‌ను అలరించనున్నారు. ఈ మేరకు స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. వార్ బ్యాక్ డ్రాప్‌గా ఓ సింహం, తోడేలు ఉగ్ర రూపంతో ఒకదానికొకటి ఢీ అంటే ఢీ అన్నట్లుగా ఆ పోస్టర్ ఉంది.

మధ్యలో ఓ పురాతన ఖడ్గం ప్రకాశిస్తూ హైప్ క్రియేట్ చేస్తోంది. 'కొన్ని యుద్ధాలు ఎప్పటికీ ముగియవు. కొంతమంది రాజులు ఎప్పటికీ మరణించరు.' అంటూ క్యాప్షన్ ఇచ్చారు. హిస్టరీ బ్యాక్ డ్రాప్‌గా సోషియో ఫాంటసీ జానర్‌లో మూవీ తెరకెక్కబోతున్నట్లు పోస్టర్‌ను బట్టి అర్థమవుతోంది. శంబాల కాంబో కావడంతో ఈ మూవీతో ఓ సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తారనే టాక్ వినిపిస్తోంది. 

Also Read : పదేళ్ల తర్వాత బిచ్చగాడు కాంబో - ట్రెండింగ్‌లో విజయ్ ఆంటోని 'వంద దేవుళ్లు' ఫస్ట్ లుక్

హీరో ఎవరంటే?

ఈ క్రేజీ ప్రాజెక్టులో సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్నారు. ఆయన కెరీర్‌లోనే ఇది బెస్ట్ మూవీగా నిలుస్తుందని చెబుతున్నారు. అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్, భారీ నిర్మాణ విలువలతో మూవీ రూపొందనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరగుతుండగా.. ఆగస్ట్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది.