సెప్టెంబర్ 27 అంటే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అభిమానులకు గుర్తుకు వచ్చేది ఒక్కటే... 'దేవర'. ఇప్పుడు ఈ సినిమాతో పాటు ఆ రోజున మరో సినిమా కూడా రానుంది. తెలుగు ప్రేక్షకులకు సైతం తెలిసిన తమిళ కథానాయకుడు కార్తీ, అరవింద్ స్వామి నటించిన 'సత్యం సుందరం' వస్తోంది. 


సెప్టెంబర్ 27న 'సత్యం సుందరం' విడుదల
కార్తీ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'సత్యం సుందరం'. ఈ సినిమా స్పెషాలిటీ ఏమిటంటే... కార్తీక్ సోదరుడు, తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉన్న తమిళ కథానాయకుడు సూర్య, జ్యోతిక దంపతులు తమ 2డీ ఎంటర్టైన్మెంట్స్ పతాకం మీద ప్రొడ్యూస్ చేస్తున్నారు. కార్తీకి సొంత సినిమా లెక్క. అరవింద్ స్వామి మరో మెయిన్ లీడ్ చేసిన సత్యం సుందరం సినిమాపై తమిళనాట మంచి అంచనాలు ఉన్నాయి. అయితే... తెలుగులో ఈ సినిమాకు గట్టి పోటీ ఉందని చెప్పాలి.






తెలుగులో 'దేవర' ముంగిట కార్తీ సినిమా!
అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో భారీ విజయం సాధించడమే కాదు.. హాలీవుడ్ సెలబ్రిటీలను సైతం మెట్టించిన 'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' తర్వాత ఎన్టీఆర్ నటించిన సినిమా కావడంతో 'దేవర' మీద భారీ అంచనాలు ఉన్నాయి. తెలుగులో పాటు తమిళ,  మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో కూడా సినిమాను విడుదల చేస్తున్నారు. ఆల్రెడీ ఆ సినిమా పబ్లిసిటీ ఓ స్థాయిలో జరుగుతోంది. మూడు పాటలు విడుదల చేశారు. నార్త్ అమెరికాలో ప్రీ సేల్స్ ఏడు లక్షల డాలర్లకు పైగా ఉన్నాయి.


తెలుగు రాష్ట్రాల్లో సైతం 'దేవర' భారీ ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ సినిమా మీద ఎన్టీఆర్ అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులలో సైతం భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటివరకు ఎటువంటి పబ్లిసిటీ స్టార్ట్ చేయని కార్తీ అరవింద్ స్వామిల సినిమా 'సత్యం సుందరం'. 'దేవర' ముందు నిలబడుతుందా? లేదా? అనేది చూడాలి. ఎన్టీఆర్ సినిమాను కాదని ఎంతమంది కార్తి సినిమాకు వెళతారని ట్రేడ్ వర్గాలు సైతం ఆసక్తిగా గమనిస్తున్నాయి. 


తెలుగులో సత్యం సుందరం సినిమాను ఏషియన్ సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాయి. సో... థియేటర్లకు ఎటువంటి లోటు ఉండదని చెప్పవచ్చు.‌ దేవర టికెట్స్ దొరకని ప్రేక్షకులు సత్యం సుందరం సినిమాకు వచ్చే అవకాశాలను కూడా కొట్టి పారేయలేం. దేవర తో పాటు రిలీజ్ చేయడం వెనక అది ఓ‌ స్ట్రాటజీ అనుకోవచ్చు.


Also Readఆస్పత్రిలో జాయిన్ అయిన దీపికా పదుకోన్ - ఏ క్షణమైనా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్



తమిళనాడులో 'దేవర'కు కాస్త ఎఫెక్ట్?
'ఆర్ఆర్ఆర్' సినిమాతో తమిళ ప్రేక్షకులకు సైతం ఎన్టీఆర్ చేరువ  అయ్యారు. అయితే... కార్తీ - అరవింద్ స్వామి నటించిన సినిమా కావడం, పైగా సూర్య - జ్యోతిక దంపతులు నిర్మించడంతో అక్కడ 'సత్యం సుందరం' సినిమాకు మొదటి రోజు ప్రేక్షకులు వెళ్లే అవకాశం ఎక్కువ. దేవర మీద ఓపెనింగ్స్ వరకు ప్రభావం చూపించే ఛాన్స్ ఉంది.‌ కంటెంట్ ఈజ్ కింగ్ కనుక బావున్నా సినిమాకు ప్రేక్షకులు తర్వాత అయినా సరే వస్తారు.


Also Readనయన్... భక్తి శ్రద్ధలతో వినాయకుడిని పూజించెన్ - భర్త, పిల్లలతో కలిసి హిందూ పద్ధతిలో!