ఆగస్టులో సమంత ఆస్ట్రేలియా వెళ్ళనున్నారు. ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్‌ (Indian Film Festival of Melbourne - IFFM 2022) కోసం! ఆగస్టు 12న మెల్‌బోర్న్‌ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభం కానుంది. విక్టోరియా రాష్ట్రంలో ఐఎఫ్ఎఫ్ఎం 2022 కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆగస్టు 13వ తేదీన చలన చిత్రోత్సవాల్లో అభిమానులతో కలిసి సమంత ఇంటరాక్ట్ కానున్నారు. ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పనున్నారు. 


కరోనా నిబంధనల కారణంగా గత రెండేళ్లు ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్‌ నిర్వహించలేదు. వర్చువల్‌గా అవార్డ్స్ ప్రదానం చేశారు. గత ఏడాది సమంత వర్చువల్ అవార్డు షోకి అటెండ్ అయ్యారు. ఈసారి ఆస్ట్రేలియా వెళ్తున్నారు. సమంతను అభిమానులు ఏం అడుగుతారో? వ్యక్తిగత జీవితం గురించి ఎవరైనా ప్రశ్నిస్తే ఆమె ఏం సమాధానం చెబుతారో? అనే ఆసక్తి నెలకొంది. 


Also Read : ఎన్టీఆర్ ఏడాది క్రితమే హైదరాబాద్ శివార్లలో ఆ ల్యాండ్ కొన్నారు - ఇప్పుడు అక్కడ


సినిమాలకు వస్తే... 'ది ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్ సీజన్ 2, 'పుష్ప : ది రైజ్' సినిమాలో ప్రత్యేక గీతంతో సమంత (Samantha Ruth Prabhu) సందడి చేశారు. ఆమె ప్రధాన పాత్రలో నటించిన 'శాకుంతలం', 'యశోద' సినిమాల చిత్రీకరణ కంప్లీట్ అయ్యింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) కు జంటగా 'ఖుషి' సినిమా చేస్తున్నారు.  


Also Read: డెలివరీ తర్వాత ముంబై నుంచి మొదటిసారి బయటకొచ్చిన కాజల్ అగర్వాల్ - అబ్బాయ్‌తో