మెగా మేనల్లుడు, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న సినిమాకు 'గాంజా శంకర్' (Ganja Shankar Movie) టైటిల్ ఖరారు చేశారు. ఈ రోజు హీరో బర్త్ డే (Sai Dharam Tej Birthday) కానుకగా టైటిల్ అనౌన్స్ చేయడంతో పాటు సినిమా ఫస్ట్ హై (వీడియో గ్లింప్స్ - Ganja Shankar First High) విడుదల చేశారు. ఇంతకు ముందు ఎప్పుడూ కనిపించని విధంగా మాసీగా సాయి ధరమ్ తేజ్ ఉన్నారు. 


'గాంజా శంకర్'ను చూశారా?
మామూలు మాస్ కాదు బ్రో!
మాస్ (Sai Dharam Tej Mass)కు నిర్వచనం ఇవ్వొద్దని, ఫీల్ అవ్వమని చెబుతూ 'గాంజా శంకర్' వీడియో గ్లింప్స్ (Ganja Shankar Video Glimpse) మొదలు పెట్టారు. ''స్పైడర్ మ్యాన్ సూపర్ మ్యాన్ కాదు నాన్నా... మన లోకల్ మ్యాన్ కథ ఏదైనా ఉంటే చెప్పు'' అని చిన్నారి అడగటంతో 'గాంజా శంకర్' ఇంట్రో మొదలైంది. 


టైటిల్ చూస్తే ప్రేక్షకులకు ఈజీగా అర్థం అవుతుంది. ఇందులో హీరోది టైటిల్ రోల్ అని! శంకర్ పాత్రలో సాయి ధరమ్ తేజ్ కనిపిస్తారని! అయితే... 'ఫస్ట్ హై'లో అతని క్యారెక్టర్ గురించి కూడా చెప్పేశారు. చిన్నప్పుడు చదువు మానేశాడని, అమ్మా నాన్నలు చెప్పిన మాట వినకుండా అడ్డమైన తిరుగుళ్ళు తిరుగుతాడని! జర్దా, గుట్కా, మందు వంటి దరిద్రపు అలవాట్లు అన్నీ ఉన్నాయని కూడా వివరించారు. గంజాయి అని పేరు చెప్పలేదు గానీ గాంజా అమ్ముతాడని మాత్రం క్లారిటీ ఇచ్చేశారు. 


'పది గంటల వరకు పార్కులు పడుకుంటాడు. అదే పదివేలు ఉంటే పార్క్ హయత్ లో ఉంటాడు' - ఈ ఒక్క డైలాగ్ చాలు. చేతిలో డబ్బులు ఉంటే 'గంజా శంకర్' ఎలా జల్సాలు చేస్తాడనేది చెప్పడానికి! మొత్తం మీద ఈ వీడియో గ్లింప్స్ ద్వారా సాయి ధరమ్ తేజ్ సినిమా మాసీగా ఉండబోతుందని చెప్పేశారు.


Also Read : 48 ఏళ్ళ వయసులో కాలేజీ స్టూడెంట్‌గా సూర్య?
 





కథానాయకుడిగా సాయి ధరమ్ తేజ్ 17వ చిత్రమిది (SDT 17 Movie). మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ శ్రీమతి సాయి సౌజన్య నిర్మాతగా ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రమిది. ఈ చిత్రానికి సమర్పణ : శ్రీకర స్టూడియోస్, సంగీతం : భీమ్స్ సిసిరోలియో, ఛాయాగ్రహణం : రిషి పంజాబీ. 


Also Read 'గాడ్' రివ్యూ : హీరోని సైకో కిల్లర్ టార్గెట్ చేస్తే? - 'జయం' రవి, నయనతార సినిమా హిట్టా? ఫట్టా?



మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సంపత్ నంది 'రచ్చ' తీశారు. పవన్ కళ్యాణ్ హీరోగా ఆయన సినిమా చేయాల్సింది. కానీ, మిస్ అయ్యింది. ఇప్పుడు మెగా మేనల్లుడు సాయి తేజ్‌ హీరోగా 'గాంజా శంకర్' తీస్తున్నారు. ఈ సినిమాలో కథానాయికగా పూజా హెగ్డే పేరు పరిశీలనలో ఉంది. 


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial