మ్యాన్ ఆఫ్ మాసెస్, యుంగ్ టైగర్ ఎన్టీఆర్ హిందీలో భారీ సినిమా చేసేందుకు 'ఎస్' చెప్పారా? అంటే... 'అవును' అని బాలీవుడ్ ఇండస్ట్రీ అంటోంది. హృతిక్ రోషన్ (Hrithik Roshan)తో ఆయన స్క్రీన్ షేర్ చేసుకోనున్నారని చెబుతోంది. అదీ సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ 'వార్'కు సీక్వెల్ 'వార్ 2' (War 2 Movie)లో!


హృతిక్ వర్సెస్ ఎన్టీఆర్!
'వార్'లో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా నటించారు. సినిమాలో ఇద్దరి మధ్య భారీ యాక్షన్ సీక్వెన్సులు ఉంటాయి. ఇద్దరూ పోటా పోటీగా నటించారు. చివరకు, టైగర్ ష్రాఫ్ క్యారెక్టర్ మరణించినట్టు చూపించారు. అయితే, ఆ సినిమాకు సీక్వెల్ ఉంటుందని యశ్ రాజ్ ఫిల్మ్స్ గతంలో ప్రకటించింది. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే... అందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించనున్నారని!


'వార్ 2'లో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ మధ్య సన్నివేశాలు 'నువ్వా నేనా' అన్నట్టు ఉంటాయని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. యశ్ రాజ్ ఫిల్మ్స్ సన్నిహిత వర్గాలు ఈ సినిమా గురించి మాట్లాడుతూ ''అవును, 'వార్ 2'లో నటించేందుకు ఎన్టీఆర్ అంగీకరించారు. ఇది నిజమైన పాన్ ఇండియా ఫిల్మ్'' అని తెలిపాయి. 


ఎన్టీఆర్ 31 ఇదేనా?
ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఓ సినిమా చేస్తున్నారు. హీరోగా ఆయన 30వ చిత్రమిది. దీని తర్వాత 'కెజియఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా అంగీకరించారు. ప్రభాస్ హీరోగా నీల్ చేస్తున్న 'సలార్' కంప్లీట్ అయ్యాక... ఎన్టీఆర్ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేశారు. అయితే... దాని కంటే ముందు 'వార్ 2' షూటింగ్ స్టార్ట్ చేయాలని ఎన్టీఆర్ ప్లాన్ చేస్తున్నారట. ఈ ఏడాది ఆఖరిలో 'వార్ 2'ను సెట్స్ మీదకు తీసుకు వెళ్లాలని హృతిక్ రోషన్, ఎన్టీఆర్ & యశ్ రాజ్ ఫిల్మ్స్ అధినేత ఆదిత్య చోప్రా భావిస్తున్నారట. 


అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో...  
'వార్' సినిమాకు సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించారు. అయితే, 'వార్ 2'కి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించనున్నారని సమాచారం. దీనికి ప్రముఖ దర్శక - నిర్మాత, యశ్ రాజ్ ఫిల్మ్స్ అధినేత ఆదిత్య చోప్రా కథ అందించారట. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన 'బ్రహ్మాస్త్ర' సినిమాకు దక్షిణాది భాషల్లో రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరించారు. హైదరాబాద్ ఈవెంట్ కు ఎన్టీఆర్ అథితిగా అటెండ్ అయ్యారు. అప్పుడు 'వార్ 2' గురించి డిస్కషన్ జరిగినట్టు సమాచారం. 


Also Read : జపాన్‌లో 'రంగస్థలం' రిలీజ్ - ఎప్పుడంటే?


షారుఖ్, సల్మాన్ కూడా ఉన్నారండోయ్!
యశ్ రాజ్ ఫిల్మ్స్... హిందీ చలన చిత్ర పరిశ్రమలో బడా నిర్మాణ సంస్థ. అదొక సినిమా ఫ్యాక్టరీ. బాలీవుడ్ బడా బడా స్టార్ హీరోలతో భారీ యాక్షన్ ఎంటర్టైనర్లు నిర్మించిన ఘనత యశ్ రాజ్ ఫిల్మ్స్ సొంతం. 'వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్' పేరుతో ఇండియన్ జేమ్స్ బాండ్ తరహా సినిమాలకు యశ్ రాజ్ ఫిల్మ్స్ శ్రీకారం చుట్టింది. 'ఏక్ థా టైగర్', 'టైగర్ జిందా హై', 'వార్', 'పఠాన్' సినిమాలో ఆ యూనివర్స్ (YRF SPY Universe) లో భాగంగా వచ్చినవే. షారుఖ్ 'పఠాన్'లో సల్మాన్ అతిథిగా కనిపించారు. ఇప్పుడు 'టైగర్ 3'లో షారుఖ్ అతిథిగా కనిపిస్తారని సమాచారం. భవిష్యత్తులో ఈ హీరోలు అందరితో మల్టీస్టారర్ సినిమాలు చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.


Also Read : ఎన్నాళ్లో వేచిన ఉదయం - పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ సినిమా షూటింగ్ మొదలైందోచ్!