Renu Desai Shared Post on Hyderabad Parliament Candidate Madhavi Latha: ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికల హడావుడి నెలకొంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికలు ఉండటంతో ఎన్నికల వాతావారణం వాడివేడిగా ఉంది. త్వరలో పార్లమెంట్‌ ఎన్నికలకు ఓటింగ్‌ జరగనున్న నేపథ్యంలో అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఎవరికి వారు గెలుపు తమదే అన్న ధీమాతో ఉన్నారు. ఇలా రసవత్తరంగా సాగుతున్న ఎన్నికల్లోకి జనసేన అధినేత, పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ మాజీ భార్య రేణుదేశాయ్‌ దూరారు. తన మాజీ భర్త సైతం పోటీ పడుతున్న ఈ ఎన్నికల్లో ఆమె అనూహ్య రీతిలో ఓ పార్టీకి మద్దతు తెలుపుతు సంచలన పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం రేణు దేశాయ్‌ పోస్ట్‌ ఇటూ ఇండస్ట్రీలో, అటూ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.


కాగా ఈసారి పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీలు పార్టీల మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతుంది. ఎందుకంటే ఈసారి అన్ని స్థానాల్లో బలమైన పోటీ ఉండేలా అభ్యర్థులను బరిలో దింపాయి అన్ని పార్టీలు. ముఖ్యంగా తెలంగాణలోని హైదరాబాద్‌ పార్లమెంట్‌ స్థానంలో ఆసక్తిగా మారింది. ఎంఐఎంకు కంచుకోటగా ఉన్న ఈ స్థానంలో బీజేపీ నుంచి స్ట్రాంగ్‌ కంటెస్టెంట్‌ను బరిలో దించింది. దీంతో ఇప్పుడు అందరి చూపు హైదరాబాద్‌ స్థానంపై పడింది. ఈ పార్లమెంట్‌ స్థానంలో అత్యంత స్ట్రాంగ్‌గా కంటెస్టెంట్‌గా‌, కొన్నేళ్లు ఎంపీగా గెలుస్తూ వస్తున్నారు ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ ఆయనను ఢీ కొట్టేందుకు బీజేపీ నుంచి మహిళా అభ్యర్థి మాధవీలతను పోటీలో నిలిపి ఎంఐఎంకు సవాల్ విసిరింది.


మాధవిలత బీజేపీ నమ్మకాన్ని రెట్టింపు చేస్తూ మరింత బలంగా ప్రచారంలో దూసుకుపోతుంది. తనదైన మాట తీరుతో ఓటర్లను ఆకట్టుకుంటోంది. గెలుపు తనదే అనేంత ధీమాగా స్ట్రాంగ్‌ ప్రచారం చేసుకుంటుంది. ఇక సోషల్‌ మీడియాలో మొత్తం మాధవీలత ప్రచార వీడియోలు దర్శనం ఇస్తున్నాయి. అంతేకాదు రీసెంట్‌గా ఓ నేషనల్‌ మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో తనదైన స్టైల్లో సమాధానాలు ఇస్తూ, ప్రత్యర్థి క్యాండిడేట్‌కి స్ట్రాంగ్‌ కౌంటర్స్‌ ఇస్తూ పొలిటికల్‌ కామెంట్స్‌  చేశారు. దీంతో ఆమె ఇచ్చిన సమాధానాలకు హోస్టే అవాక్క్‌ అయ్యారు. ఇక మాధవిలత ఇచ్చిన ఇంటర్య్వూ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవ్వడంతో ఆమె ట్రెండింగ్‌లో నిలిచింది. ప్రచారంలో తనదైన ప్రచారంలో తనదైన హస్త్రాలతో దూసుకుపోతున్న మాధవిలత ఎంఐఎం చుక్కలు చూపిస్తున్నారు. ఈ క్రమంలో ఇలాంటి మాధవిలత స్ట్రాంగ్ ఉమెన్‌ అంటూ ప్రశంసిస్తూ నటి రేణుదేశాయ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో ఆసక్తికర పోస్ట్‌ షేర్‌ చేసింది.






"చాలా కాలం తర్వాత ఇంతటి బలమైన మహిళను చూస్తున్నాను. ఈ పోస్ట్‌ పెట్టడానికి నాకు ఎవరూ డబ్బు ఇవ్వలేదు. ఇది పెయిడ్‌ పోస్ట్‌ అసలు కాదు. ఆమె బలమైన అభ్యర్థి అని నమ్మాను. అందుకే నా అభిప్రాయాన్ని మీతో పంచుకుంటున్నా" అంటూ ఆమె తన పోస్ట్‌లో రాసుకోచ్చారు. దీంతో  కాబట్టి తనకు మద్దతు తెలుపుతున్నాను. దీంతో ప్రస్తుతం ఆమె పోస్ట్‌ ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. తన మాజీ భర్త పవన్‌ కళ్యాణ్‌కు మద్దతు ఇవ్వకుండ పక్క రాష్ట్రం అభ్యర్థికి ఆమె సపోర్టు ఇవ్వడం ఇప్పుడు సర్వత్రా ఆసక్తిని సంతరించుకుంది. కాగా ఒకప్పుడు హీరోయిన్‌గా రాణించిన రేణు దేశాయ్‌ పెళ్లి అనంతరం నటనకు గుడ్‌బై చెప్పింది. విడాకులు తర్వాత ఒంటరిగా పిల్లలతో నివసిస్తున్న ఆమె పలు షోలకు జడ్జీగా వ్యవహరించింది. రీసెంట్‌గా టైగర్‌ నాగేశ్వరరావు సినిమాతో ఆమె సెకండ్‌ ఇన్నింగ్స్‌ మొదలు పెట్టింది. 



Also Read: నన్ను కుక్కతో పోల్చారు, దారుణంగా అవమానించారు - సల్మాన్‌ ఖాన్‌ బావ ఆయుష్‌ శర్మ భావోద్వేగం