మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, సౌత్ ఇండియా స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో పాన్ ఇండియా సినిమా తెరకెక్కుతోంది. రామకృష్ణ - మౌనిక దంపతులు ప్రొడక్షన్ డిజైనర్లుగా సినిమా ప్రారంభం అయ్యింది. ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం ప్రకారం వాళ్ళిద్దరూ సినిమా నుంచి తప్పుకున్నారు. వాళ్ళ స్థానంలో రవీందర్ రెడ్డిని తీసుకున్నారట.


రామ్ చరణ్ 'రంగస్థలం' సినిమాకు రామకృష్ణ - మౌనిక పని చేశారు. 'పుష్ప', 'తలైవి' తదితర పాన్ ఇండియా సినిమాలు చేశారు. హీరోతో వాళ్ళిద్దరికీ సత్సంబంధాలు ఉన్నాయి. మరి, ఎవరితో పడలేదు? ఏమిటి? అనే వివరాలు తెలియలేదు. కానీ, రామకృష్ణ - మౌనిక స్థానంలో రవీందర్ రెడ్డి ఎంపిక వెంటనే జరిగింది. రామ్ చరణ్ 'మగధీర'కు రవీందర్ రెడ్డి పని చేశారు. ఆ సినిమాకు నేషనల్ అవార్డు కూడా అందుకున్నారు.


అమృత్‌స‌ర్‌లో రామ్ చరణ్, హీరోయిన్ కియారా అడ్వాణీ పాల్గొనగా ఒక షెడ్యూల్ చేశారు. ఆ తర్వాత విశాఖలో కొన్ని రోజులు షూటింగ్ చేశారు. అంతకు ముందు రాజమండ్రిలో కొన్ని సన్నివేశాలను తెరకెక్కించారు. సుమారు 50 శాతం సినిమా కంప్లీట్ అయ్యిందని తెలుస్తోంది. ఈ తరుణంలో ప్రొడక్షన్ డిజైనర్ మార్పు అనేది ఇండస్ట్రీలో చాలా మందికి షాక్ ఇచ్చింది. ఏదో గొడవ అయ్యి ఉంటుందని అంతా భావిస్తున్నారు. 


Also Read: కోటి రూపాయలు ఆఫర్ చేసినా పెళ్లిలో పాడలేదు - అదీ సింగర్ కేకే క్యారెక్టర్


రామ్ చరణ్ ఐఏఎస్ అధికారిగా, శ్రీకాంత్ ముఖ్యమంత్రిగా, సునీల్, 'వెన్నెల' కిషోర్, ప్రియదర్శి, నవీన్ చంద్ర తదితరులు నటిస్తున్న ఈ సినిమాను శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ పతాకంపై 'దిల్‌' రాజు, శిరీశ్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు.


Also Read: ప్రముఖ గాయకుడు కేకే హఠాన్మరణం - స్టేజ్‌పై ప్రదర్శన ఇస్తూనే - ప్రధాని మోదీ దిగ్భ్రాంతి!