Ravanasura : 'ధమాకా' బ్లాక్‌బస్టర్ సక్సెస్ తర్వాత మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ చిత్రం 'రావణాసుర'.  సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 7న రిలీజైంది. ఫరియా అబ్దుల్లా, ప్రియాంకా అరుళ్‌ మోహన్ హీరోయిన్లుగా ఈ నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిక్స్ డ్ రెస్పాన్స్ ను దక్కించుకుంది. భారీ అంచనాల మధ్య రిలీజైనా.. ప్రేక్షకులను ఊహించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. తాజాగా ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ కానున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మే 5, 2023న OTT ప్లాట్‌ఫారమ్ 'అమెజాన్ ప్రైమ్ వీడియో'లో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.


మాస్ హీరో రవితేజ నటించిన 'రావణాసుర' సరికొత్త వెర్షన్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకు సంబంధించి రిలీజైన పోస్టర్స్, ట్రైలర్, టీజర్.. భారీ అంచనాలను క్రియేట్ చేశాయి. రన్-ఆఫ్-ది-మిల్ కమర్షియల్ డ్రామాగా ప్రారంభమై, కాసేపటికి థ్రిల్లర్‌ గా మారే ఈ స్టోరీ నేపథ్యం ఆద్యంతం ఆసక్తిగా సాగినా.. చివరికి మాత్రం ఆడియెన్స్ ను అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇంటర్వెల్ తర్వాత వచ్చే సీన్స్ ప్రేక్షకులకు మరింత చిరాకును తెప్పిస్తాయి. కాస్త ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యామనుకునే లోపే మళ్లీ.. స్టోరీ దారి తప్పినట్టనిపిస్తుంది. మధ్యలో వచ్చే మ్యూజిక్, పాటలు కొన్ని సార్లు చాలా అడ్డంకిగా, బలవంతంగా స్టోరీలోకి నెట్టబడినట్టు అనిపిస్తాయి. ఇన్ని నెగెటివ్ కామెంట్స్ మధ్య 'రావణాసుర' మూవీ రవితేజ ఫ్యాన్స్ కు అత్యంత నిరాశకు గురి చేసింది. ‘ధమాకా’ భారీ సక్సెస్ ఇస్తాడనుకున్న అభిమానులకు ఎదురుదెబ్బ తగిలినట్టయింది. దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాకు ఓ మోస్తరు రేంజ్ లో మాత్రమే మార్కులు పడ్డాయి.


మొన్నటివరకూ థియేటర్లలో ఆడిన 'రావణాసుర' సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వస్తుందంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. థియేటర్లలో చూడని కొంతమంది ఓటీటీలో చూడొచ్చని ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియోస్ గత కొన్ని రోజుల క్రితమే సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. 'రావణాసుర'ను మే 5 నుంచి ఆన్ లైన్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్టు తాజాగా ప్రచారం జరుగుతోంది. కాగా ఈ సమాచారంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. 


 యాక్షన్ థ్రిల్లర్ 'రావణాసురను' అభిషేక్ పిక్చర్స్, RT టీమ్‌వర్క్స్ కలిసి నిర్మించాయి.ఈ మూవీలో హీరో రవితేజతో పాటు అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నగార్కర్, పూజిత పొన్నాడ, శ్రీరామ్, సుశాంత్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. భీమ్స్ సిసిరోలియో, హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.


గతేడాది 'క్రాక్', 'రామారావు ఆన్ డ్యూటీ', 'ధమాకా' లాంటి సినిమాలతో అలరించిన మాస్ రాజా... ఈ ఏడాది వాల్తేరు వీరయ్య, రావణాసుర చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం టైగర్ నాగేశ్వరరావుతో పాటు సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న సినిమాలో నటిస్తున్నారు. ‘కలర్ ఫొటో’ లాంటి చిన్న సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన సందీప్ రాజ్‌తో రవితేజ కొత్త సినిమాతో జట్టు కట్టనున్నాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి.


Read Also: అలా మెరిసి, ఇలా మాయమయ్యారు - తొలి సినిమాతో మనసుదోచి కనుమరుగైన హీరోయిన్లు వీళ్లే