Ranbir Kapoor Ramayan Shoot started: సినిమా ల‌వ‌ర్స్ ఎంత‌గానో ఎద‌రుచూస్తున్న సినిమా 'రామాయ‌ణ‌'. ఈ సినిమాకి సంబంధించి వార్త‌లు ఎప్పుడూ వైర‌ల్ అవుతూనే ఉంటాయి. ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన‌ప్ప‌టి నుంచి రూమ‌ర్స్ బ‌యటికి వ‌స్తూనే ఉన్నాయి. దాంట్లో భాగంగా.. ఇప్పుడు సిసినిమాకి సంబంధించి షూటింగ్ ప్రారంభ‌మైన‌ట్లు ఫొటోలు వైర‌ల్ అవుతున్నాయి. దీంతో ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు. దానికి సంబంధించి ఫొటోలను తెగ షేర్ చేస్తున్నారు. 


వైర‌ల్ అవుతున్ ఫొటోలు.. 


'రామాయ‌ణ' షూటింగ్ స్టార్ట్ అయ్యింది అంటూ.. రిడిట్ ట్రెడ్ లో పోస్ట్ షేర్ చేసింది. ఆ ఫొటోలో.. పెద్ద పెద్ద పిల్ల‌ర్లు వేసి, చెక్క‌తో గోడ‌లు క‌ట్టి ఉన్నాయి. సెట్ మొత్తాన్ని క‌వ‌ర్ చేశారు. బ‌య‌టికి క‌నిపించ‌కుండా జాగ్ర‌త్త ప‌డ్డారు. డైరెక్ట‌ర్ నితిశ్ తివారీ.. పూజ చేసి షూటింగ్ మొద‌లుపెట్టిన‌ట్లు నేష‌న‌ల్ మీడియా చెప్పింది. ఇక రాముడిగా న‌టిస్తున్న ర‌ణ్ బీర్ క‌పూర్ త్వ‌ర‌లోనే షూటింగ్ లో పాల్గొంటార‌ని తెలుస్తోంది. 


వ‌ర్క‌వుట్స్ చేస్తున్న ర‌ణ్ బీర్.. 


రామాయ‌ణ ప్రాజెక్ట్ అని అనౌన్స్ చేసిన‌ప్ప‌టి నుంచి వ‌స్తున్న వార్త రాముడిగా ర‌ణ్ బీర్ క‌పూర్ నటిస్తునారు అని. అయితే, దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న రాలేదు. అయితే, ఇటీవ‌ల ర‌ణ్ బీర్ క‌పూర్ సినిమా కోసం వ‌ర్క‌వుట్స్ చేస్తున్న‌ట్లుగా వార్త వైర‌ల్ అయ్యింది. ర‌ణ్ బీర్ క‌పూర్ ట్రైన‌ర్ ఒక ఫొటోను షేర్ చేస్తూ దానికి #headstand #ramayan #newskill #trainingwithnam #prep అంటూ హ్యాష్‌ట్యాగ్ లు పెట్టారు. దీంతో రామాయాణ హ్యాష్ ట్యాగ్ ఉండ‌టంతో ఆ సినిమా కోసం ర‌ణ్ బీర్ వ‌ర్కౌట్ చేస్తున్నార‌ని వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేశాయి. 


సీత‌గా సాయి ప‌ల్ల‌వి.. 


రాముడిగా ర‌ణ్ బీర్ క‌పూర్ న‌టిస్తుండ‌గా.. సీత‌గా సాయి ప‌ల్ల‌వి నటిస్తుంద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. ఆలియా భ‌ట్ ని సంప్ర‌దించ‌గా ఆమెకు డేట్స్ కుద‌ర‌క‌పోవ‌డంతో సాయి ప‌ల్ల‌విని ఫైన‌ల్ చేసిన‌ట్లుగా వార్త‌లు వ‌చ్చాయి. అయితే, సాయిప‌ల్ల‌వి ప్లేస్ లో జాన్వీ క‌పూర్ ని ఫైన‌ల్ చేసిన‌ట్లుగా కూడా వార్త‌లు వ‌చ్చాయి. ఇక కేజీఎఫ్ స్టార్ య‌ష్ రావ‌ణుడిగా, స‌న్నీ డియోల్ హ‌నుమంతుడిగా, బాబీ డియోల్, విజ‌య సేతుప‌తి కుంభ‌క‌ర్ణ‌, విభీష‌ణుడి పాత్ర‌లు పోషిస్తున్న‌ట్లుగా తెలుస్తోంద‌. అయితే, ఈసినిమాకి సంబంధించి.. ఎలాంటి విష‌యాలు కూడా అధికారికంగా ప్ర‌క‌టించ‌లేదు. 


ప్రాజెక్ట్ నుంచి ఔట్.. 


ఈ భారీ ప్రాజెక్ట్ ను మూడు భాగాలుగా రిలీజ్ చేయ‌నున్న‌ట్లు మొద‌టి నుంచి వార్త‌లు వినిపిస్తూనే ఉన్నాయి. భారీ బ‌డ్జెట్ తో వాటిని తెర‌కెక్కిస్తున్నార‌నే వార్త‌లు వ‌చ్చాయి. ‘గ‌జినీ’ ఫేమ్ మ‌ధు మంతెన‌, స్టార్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ ఈ సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నార‌ని గ‌తంలో తెలిసింది. అయితె, ఇప్పుడు ఆ ఇద్ద‌రు ప్రాజెక్ట్ నుంచి బ‌య‌టికి వ‌చ్చేశార‌ట. డైరెక్ట‌ర్, టెక్నిక‌ల్ టీమ్ ప్రొడ్యూస‌ర్ల మ‌ధ్య క‌మ్యూనికేష‌న్ గ్యాప్, మ‌న‌స్ప‌ర్థ‌ల కార‌ణంగానే ఇలా జ‌రిగింద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. అయితే, ఈ విష‌యాన్ని అధికారికంగా ప్ర‌క‌టించాల్సి ఉంది.



Read Also: ఫ్యాన్స్ ప్రేమకు ఫిదా - ‘ఫ్యామిలీ స్టార్’ ప్రీ రిలీజ్‌లో మృణాల్ చేసిన పనికి అంతా షాక్