అక్కినేని నాగచైతన్య కథానాయకుడిగా తమిళ దర్శకుడు వెంకట్ ప్రభుతో ప్రముఖ నిర్మాత శ్రీనివాసా చిట్టూరి తెలుగు, తమిళ ద్విభాషా చిత్రం నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ్ బైలింగ్వల్ అనేది చాలా మందికి షాక్ ఇచ్చింది. ఎందుకంటే... తమిళ హిట్ 'మానాడు'ను తెలుగులో చైతూ రీమేక్ చేస్తారని వినిపించింది. అసలు విషయం ఏంటంటే... 'మానాడు' రీమేక్‌లో చైతూ హీరో కాదు, రానా దగ్గుబాటి!


అవును... మీరు చదివింది నిజమే! తమిళంలో శింబు, ఎస్.జె. సూర్య ప్రధాన పాత్రల్లో నటించిన 'మానాడు'ను తెలుగులో రానా దగ్గుబాటి రీమేక్ చేస్తున్నారు. తమిళ సినిమాకు వెంకట్ ప్రభు దర్శకత్వం వహించారు. మరి, తెలుగు రీమేక్ కూడా ఆయనే తీస్తారా? లేదంటే మరొకరి చేతిలో దర్శకత్వ బాధ్యతలు పెడతారా? అనేది చూడాలి.


రానా దగ్గుబాటి తండ్రి, ప్రముఖ నిర్మాత సురేష్ బాబు 'మానాడు' రీమేక్ రూట్స్ సొంతం చేసుకున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై సినిమా ప్రొడ్యూస్ చేయనున్నారు. 'థ్యాంక్యూ' సినిమా విడుదల సందర్భంగా మీడియాతో ముచ్చటించిన అక్కినేని నాగ చైతన్య 'మానాడు' రీమేక్ విషయాన్ని చెప్పారు. త్వరలో ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన రావచ్చు.


Also Read : ధనుష్ హాలీవుడ్ సినిమా 'ది గ్రే మ్యాన్' - తీయడానికి తొమ్మిదేళ్లు! ఎందుకంటే?


వెంకట్ ప్రభు దర్శకత్వంలో తాను కథానాయకుడిగా తెరకెక్కబోయే సినిమా కొత్త కథతో రూపొందుతోందని, 'మానాడు' విడుదలకు ముందు నుంచి దర్శకుడితో ట్రావెల్ చేస్తున్నానని నాగ చైతన్య చెప్పారు. 


Also Read : చెన్నై అపోలో ఆస్పత్రిలో మణిరత్నం, ఆందోళనలో ఫ్యాన్స్ - ఆయనకు ఏమైందంటే?