Ram Charan Reveals Interation With PM Modi Connects To Peddi Movie : తాను ఢిల్లీలో ప్రధాని మోదీని కలిసినప్పుడు ఆయన పెద్ది సినిమా గురించి అడిగినట్లు చెప్పారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ప్రమోషన్లలో భాగంగా గురువారం ఢిల్లీలో మూవీ టీం సందడి చేసింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ చెప్పిన ఇన్‌స్పిరేషనల్ స్టోరీ గురించి షేర్ చేసుకున్నారు చరణ్.

Continues below advertisement

ఆ ఫుట్ బాలర్... ఓ ఇన్‌స్పిరేషన్...

ఢిల్లీలో ప్రధాని మోదీని కలిసినప్పుడు 'పెద్ది' సినిమా దేని గురించి అని అడిగినట్లు చెప్పారు చరణ్. 'పెద్ది ఓ విధంగా వికసిత్ భారత్ గురించి చెప్పే స్టోరీ అని వివరించా. గ్రామాల్లో ఉండే మట్టిలో మాణిక్యాల కథ అని చెప్పాను. అప్పుడు ఆయన నాతో ఓ ఇన్‌స్పిరేషనల్ స్టోరీ షేర్ చేసుకున్నారు. పశ్చిమ బెంగాల్‌లో ఎలక్షన్ క్యాంపెయిన్‌లో ఎదురైన ఓ అద్భుత అనుభవాన్ని పంచుకున్నారు. అక్కడ ఓ గ్రామంలో మహ్మద్ అనే ఫుట్ బాల్ ప్లేయర్ ఉండేవాడు.

Continues below advertisement

కొన్నేళ్ల క్రితమే భారత్ తరఫున ఆడాడు. అలా తన ఊరికి గుర్తింపు తీసుకొచ్చాడు. ఇప్పుడు ఆ గ్రామం నుంచి 85 మంది ప్లేయర్స్ ఉన్నారని చెప్పారు. ఓ వ్యక్తి ఎలాంటి మార్పు తీసుకు రాగలడు అనే దానికి ఇదే నిదర్శనం. పెద్ది కూడా ఓ గిరిజన ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి గురించిన స్టోరీనే.' అని చరణ్ తెలిపారు.

Also Read : Meri Awas Suno OTT : నాలుగేళ్ల తర్వాత ఓటీటీలోకి రియల్ లైఫ్ స్టోరీ - తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?

దేశవ్యాప్తంగా ప్రమోషన్స్

పెద్ది ప్రమోషన్స్ దేశవ్యాప్తంగా ప్లాన్ చేశారు మేకర్స్. ఇప్పటికే భోపాల్, బెంగుళూరులో ప్రమోషన్స్ కంప్లీట్ కాగా... గురువారం దేశ రాజధాని ఢిల్లీలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందులో చరణ్, జాన్వీ కపూర్, దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ తదితరులు పాల్గొన్నారు. పెద్ది గురించి చరణ్, జాన్వీ కపూప్ ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు. సినిమాలో ఇంత బాగా డ్యాన్స్ ఎలా చేశారంటూ ఎదురైన ప్రశ్నకు చరణ్... ప్రొడ్యూసర్ మంచి పేమెంట్ ఇచ్చారంటూ నవ్వులు పూయించారు.

పైరసీకి చెక్...

పెద్ది పైరసీకి చెక్ పెట్టేలా మద్రాస్ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. కాపీ రైట్స్‌కు సంబంధించి చిత్ర నిర్మాణ సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారించిన హైకోర్టు వెకేషన్ బెంచ్ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ఆన్ లైన్‌లో అక్రమంగా అప్‌లోడ్ చేయడం, ప్రసారం చేయడం, కాపీ చేయడాన్ని నిరోధిస్తూ యాంటీ పైరసీ ఇంజంక్షన్ జారీ చేసింది.

పెద్దిలో చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించారు. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, జగపతిబాబు, బొమన్ ఇరానీ, దివ్యేందు శర్మ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించగా... సుకుమార్, మైత్రీ మూవీ మేకర్స్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మించారు. జూన్ 4న వరల్డ్ వైడ్‌గా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది. 

Also Read : Blast Zone Review - 'బ్లాస్ట్ జోన్' రివ్యూ: యాక్షన్ కింగ్ అర్జున్ లేటెస్ట్ థ్రిల్లర్ - సినిమా ఎలా ఉందంటే?