రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును రజినీకాంత్ ఆదివారం కలిసే అవకాశాలున్నాయని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇందుకు ఆయన దరఖాస్తు కూడా చేసుకున్నట్లు సమాచారం. అయితే, అనివార్య కారణాల వల్ల రజినీకాంత్ ఆదివారం చంద్రబాబును కలవడానికి వెళ్లలేకపోయారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘ఈ రోజు నేను ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడును కలవాల్సి ఉండేది. కానీ, ఫ్యామిలీ ఫంక్షన్ వల్ల వెళ్లలేకపోయాను’’ అని తెలిపారు. 


చంద్రబాబు అరెస్టు వార్త తెలిసిన రోజు నుంచి రజినీకాంత్ నారా లోకేష్‌తో టచ్‌లో ఉన్నారు. ఆయనే స్వయంగా లోకేష్‌కు ఫోన్ చేసి దైర్యం చెప్పారు. తన మిత్రుడు చంద్రబాబు గొప్ప పోరాట యోధుడని కొనియాడారు. చంద్రబాబు ప్రజాసంక్షేమం కోసం నిరంతరం పరితపించే గొప్ప పోరాట యోధుడని, తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు ఆయనని ఏం చేయలేవని అన్నారు సూపర్ స్టార్ రజినీకాంత్ చంద్రబాబు చేసిన అభివృద్ధి, సంక్షేమమే ఆయనకి రక్షగా నిలుస్తుందన్నారు రజినీకాంత్. ఇలాంటి సమయంలో లోకేష్ ధైర్యంతో ఉండాలని సూచించారు. ఆయన కచ్చితంగా బయటకు వస్తారని ధీమా వ్యక్తంచేశారు.  


స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో తనపై ఎలాంటి ఆరోపణలు లేకపోయినా కేసు నమోదు చేసి జైల్లో పెట్టారని బెయిల్ ఇవ్వాలని చంద్రబాబు ఇటీవల పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. కనీసం ఎప్‌ఐఆర్‌లో కూడా తన పేరు లేదని కోర్టుకు తెలియజేశారు. ఏపీఎస్‌డీసీ ఛైర్మన్‌ ఇచ్చిన ఫిర్యాదులో కూడా తన పేరు లేదని గుర్తు చేశారు. రాజకీయంగా ప్రతీకారం తీర్చుకోవడానికే ఈ కేసులో ఇరికించారని దీన్ని పరిగణలోకి తీసుకొని బెయిల్ ఇవ్వాలని రిక్వస్ట్ పెట్టుకున్నారు. రజినీకాంత్ మరొక రోజు చంద్రబాబును కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 


తమిళ అగ్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఈ ప్రాజెక్టును భారీ బడ్జెట్ తో నిర్మించనుంది. ఇక వరుస అపజయాల తర్వాత 'జైలర్' తో భారీ బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న రజినీకాంత్ తదుపరి చిత్రంగా లోకేష్ కనగరాజ్ ప్రాజెక్ట్ ఉండడంతో ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాల నెలకొన్నాయి. దానికి తోడు కార్తీ, కమలహాసన్, విజయ్ లాంటి స్టార్స్ కి బ్లాక్ బస్టర్ అందించిన లోకేష్ రజనీకాంత్ కి కూడా గ్యారెంటీగా మరో బ్లాక్ బస్టర్ ఇవ్వడం ఖాయమని ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కోలీవుడ్ లో భారీ డిమాండ్ ఉన్న డైరెక్టర్స్ లో లోకేష్ కనకరాజు ముందు వరుసలో ఉంటారు. అందుకే ఈ డైరెక్టర్ తో వర్క్ చేయడానికి మన టాలీవుడ్ స్టార్స్ కూడా ఆసక్తికరపరుస్తున్నారు. 


‘జైలర్’ సీక్వెల్‌లో బాలయ్య?


‘జైలర్‌కు సీక్వెల్ ఉండబోతుందని, అందులో బాలకృష్ణ నటిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజం’ అని ఒక జర్నలిస్ట్.. వసంత్ రవిని ప్రశ్నించారు. అయితే ఈ విషయం గురించి తనకు అసలు తెలియదని, తెలుసుకోవాలంటే దర్శకుడు నెల్సన్‌ను అడగాలని సింపుల్‌గా, స్ట్రెయిట్‌గా సమాధానమిచ్చాడు వసంత్ రవి. అంతే కాకుండా తను తరువాత నటిస్తున్న తెలుగు చిత్రాల గురించి అడగగా.. ‘‘ప్రస్తుతం ‘వెపన్‌’పై ఫోకస్ పెడదాం’’ అని సూటిగా చెప్పేశాడు. మల్టీ స్టారర్ సినిమాలపై కూడా తన అభిప్రాయాన్ని బయటపెట్టాడు వసంత్ రవి.


Also Read: డై హార్డ్ ఫ్యాన్ అంటే ఇతనే - వెంటిలేటర్‌తో థియేటర్‌కు వచ్చి 'జవాన్' సినిమా చూసిన వీరాభిమాని!