Allu Arjun receives a massive welcome in Vizag : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ 'పుష్ప: ది రూల్' కోసం సినీ ఆడియన్స్ ఎంత ఆసక్తితో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 'పుష్ప: ది రైజ్' భారీ విజయం అందుకోవడంతో 'పుష్ప2' ని మరింత గ్రాండ్ స్కేల్లో తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా సాగుతోంది. రీసెంట్ గా రామోజీ ఫిలిం సిటీ లో ఓ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న మూవీ టీం నెక్స్ట్ షెడ్యూల్ ని వైజాగ్ లో ప్లాన్ చేసింది. ఈ క్రమంలోనే షూటింగ్ కోసం అల్లు అర్జున్ నేడు వైజాగ్ కు వెళ్లారు. బన్నీ వైజాగ్ వస్తున్నాడనే విషయం తెలియడంతో అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు.


వైజాగ్ లో అడుగుపెట్టిన అల్లు అర్జున్


'పుష్ప 2' షూటింగ్ లేటెస్ట్ షెడ్యూల్ ని వైజాగ్ లో ప్లాన్ చేశారు. ఈ క్రమంలోనే షూటింగ్ కోసం బన్నీ నేడు వైజాగ్ కి చేరుకున్నారు. ఈరోజు మధ్యాహ్నం అల్లు అర్జున్ వైజాగ్ ఎయిర్ పోర్ట్ లో దిగారు. ఇక అల్లు అర్జున్ వైజాగ్ వస్తున్నాడనే విషయం తెలియడంతో ఆయన అభిమానులు భారీ ఎత్తున ఎయిర్ పోర్ట్ కి తరలివచ్చారు. వీరిలో లేడీ ఫ్యాన్స్ కూడా ఉండడం విశేషం. 






బన్నీపై పూల వర్షం కురిపిస్తూ ఫ్యాన్స్ గ్రాండ్ వెల్కమ్


వైజాగ్ ఎయిర్ పోర్ట్ లో దిగిన బన్నీకి ఫ్యాన్స్ గ్రాండ్ వెల్కమ్ చెబుతూ అక్కడి నుంచి బన్నీ బస చేసే హోటల్ వరకు బైక్ ర్యాలీతో తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ పై పూల వర్షం కురిపిస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. మరి కొంతమంది అభిమానులు బన్నీతో ఫోటోల కోసం ఎగబడ్డారు. ఫ్యాన్స్ అంతా భారీ ర్యాలీగా రావడంతో వైజాగ్ రోడ్లన్నీ ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ తో నిండిపోయాయి. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. కాగా రేపటి నుంచి వైజాగ్ పోర్ట్ ఏరియాలో 'పుష్ప 2' షూటింగ్ జరగనున్నట్లు సమాచారం. ఇక్కడ అల్లు అర్జున్ పై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది.






పాన్ వరల్డ్ లెవెల్ లో రిలీజ్ కి సన్నాహాలు


'పుష్ప 2' సినిమాని నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమా కోసం సుమారు రూ.300 కోట్లకు పైగా భారీ బడ్జెట్ ని కేటాయిస్తున్నారు. ఈ క్రమంలోనే సినిమాని పాన్ వరల్డ్ స్థాయిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇండియన్ లాంగ్వేజెస్ తో పాటు రష్యా, జపాన్, చైనా వంటి పలు దేశాల్లో 'పుష్ప2' రిలీజ్ ని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. రీసెంట్ గా జపాన్ టోక్యోలో జరిగిన ఓ అవార్డ్స్ ఫంక్షన్ కి వెళ్లిన 'పుష్ప' హీరోయిన్ రష్మిక మందన్న 'పుష్ప2' ఒరిజినల్ వెర్షన్ ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో అదే రోజు జపాన్లో కూడా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు స్వయంగా వెల్లడించింది. అంతేకాదు ఇందుకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయని, 'పుష్ప2' రిలీజ్ వరల్డ్ వైడ్ ఎంతో భారీగా ఉండబోతుందని చెప్పడంతో సినిమాని పాన్ వరల్డ్ రేంజ్ లో రిలీజ్ చేస్తున్నట్లు స్పష్టమవుతుంది.