Latest Cinema Updates: నిహారిక వర్సెస్‌ బన్నీవాసు చేస్తున్న ఛాలెంజ్‌లో విజేత ఎవరో ఈ సాయంత్రం తేలిపోనుంది. ఎవరు సత్తా ఏంటో క్లారిటీ రానుంది. సినిమా ప్రమోషన్ కోసం ఇద్దరు నిర్మాతల చేస్తున్న యుద్ధం ఇది. రెండు యూనిట్‌లు కలిసి సాయంత్రం ఆరు గంటలకు గ్రౌండ్‌లో తలపడనున్నాయి. 


ప్రమోషన్‌లో క్రియేటివిటీ
ఈ మధ్య కాలంలో తెలుగు సినిమా పరిశ్రమ కొత్త పుంతలు తొక్కుతోంది. కథనం, కథలు, సాంకేతికతలో ఎంత అడ్వాన్స్డ్‌గా ఉందో మిగతా విషయాల్లో అంతే స్పీడ్‌గా కొత్తగా ఆలోచిస్తోంది. కరోనా తర్వాత మారిన పరిస్థితులకు అనుగుణంగానే నిర్మాణ సంస్థలు వైవిధ్యంగా ప్రమోట్ చేస్తూ ప్రేక్షులను థియేటర్ల వైపునకు రప్పిస్తున్నారు. అలాంటి ప్రయత్నాల్లోనే నిహారిక,బన్నీ వాసు ఉన్నారు. 


ఆయ్‌ అంటున్న బన్నీ వాసు, కమిటీ కుర్రోళ్లతో వస్తున్న నిహారిక 


వినూత్న కథాంశంతో ఆయ్‌, క‌మిటీ కుర్రోళ్ళు సినిమాలు ఆగస్టులో విడుదల కానున్నాయి. థియేటర్లో స్లైడ్‌లు, టీవీల్లో యాడ్స్, సోషల్ మీడియాలో మీమ్స్‌, ఇతర మార్గాల్లో ప్రచారంతోపాటు మరో సరికొత్త పంథాలో ఈ చిత్ర బృందాలు తమ సినిమాను ప్రమోట్ చేస్తున్నాయి. అందులో భాగంగానే సాయంత్రం ఆరు గంటలకు ఈ రెండు సినిమాల నిర్మాణంలో భాగమైన వారంతా క్రికెట్ ఆడబోతున్నారు. 


సరదా ఛాలెంజ్‌లు 
ఆయ్ సినిమా ఆగ‌స్ట్ 15న రిలీజ్ కానుంది. ఆ నెలలోనే "క‌మిటీ కుర్రోళ్ళు" సినిమా విడుదల కానుంది. "ఆయ్" సినిమా నిర్మాత బ‌న్నీ వాస్‌ను "క‌మిటీ కుర్రోళ్ళు" చిత్ర నిర్మాత నిహారిక కొణిదెల ఛాలెంజ్ చేయనున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. రెండు టీమ్స్ మ‌ధ్య జ‌ర‌గ‌బోయే క్రికెట్ మ్యాచ్‌కు సంబంధించి బ‌న్నీ వాస్‌, నిహారిక కొణిదెల మ‌ధ్య జ‌రిగిన ఛాలెంజ్‌ అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. బ‌న్నీ వాస్ ఛాలెంజ్‌కు నిహారిక ప్రతిసవాల్ చేశారు. కచ్చితంగా "ఆయ్" టీమ మీద "క‌మిటీ కుర్రోళ్ళు" టీమ్ విజ‌యం సాధిస్తుంద‌ని నమ్మకంతో చెప్పారు. 


సాయంత్రం మ్యాచ్ 
ఇవాళ(జులై 19) సాయంత్రం ఆరు గంట‌ల‌కు జ‌ర‌గ‌బోయే మ్యాచ్‌లో నువ్వు గెలుస్తావా.. అంటే నువ్వు గెలుస్తావా అంటూ సాగిన చిట్ చాట్ స‌ర‌దాగా ఉంది. ఈ రెండు సినిమాలు కూడా గోదావ‌రి బ్యాక్ డ్రాప్‌తోనే తెర‌కెక్కాయి. క్రికెట్‌, మూవీ ల‌వ‌ర్స్‌ను ఈ మ్యాచ్ ఆక‌ట్టుకుంటుంద‌నటంలో సందేహం లేదంటున్నాయి ఈ రెండు టీమ్స్.



ఆయ్ సినిమా గురించి:
తిరుగులేని ఫ‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా "ఆయ్" చిత్రం ఆకట్టుకోనుందన్న ధీమాతో ఉంది ఆ చిత్ర యూనిట్. నార్నే నితిన్‌, న‌య‌న్ సారిక‌, రాజ్ కుమార్ క‌సిరెడ్డి, అంకిత్ కొయ్య ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించారు. ఆగ‌స్ట్ 15న ఈ చిత్రం విడుద‌ల కానుంది. అంజి కె.మ‌ణిపుత్ర ఈ చిత్రంతో దర్శకుడిగా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాను బ‌న్నీ వాస్‌, విద్యా కొప్పినీడి నిర్మిస్తున్నారు. సీనియర్ ప్రొడ్యూసర్ అల్లు అర‌వింద్ దీనికి సమర్పకుడిగా ఉన్నారు. రామ్ మిర్యాల సంగీతాన్ని సమకూర్చారు. 


Also Read: 'డార్లింగ్' ఓటీటీ, శాటిలైట్ పార్ట్నర్ ఫిక్స్ - ప్రియదర్శి, నభా నటేష్ సినిమా స్ట్రీమింగ్ ఎందులో అంటే?


క‌మిటీ కుర్రోళ్ళు సినిమా గురించి:
సందీప్ స‌రోజ్‌, య‌శ్వంత్ పెండ్యాల‌, త్రినాథ్ వర్మ, ప్రసాద్ బెహ‌రా, ఐశ్వర్య ర‌చిరాజు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న క‌మిటీ కుర్రోళ్ళు చిత్రం సినీ ప్రేక్షుకులను ఆకట్టుకోవడంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు నిర్మాత నిహారిక. యూత్‌కు బాగా కనెక్ట్ అయ్యే కంటెంట్‌తో వస్తున్న ఈ సనిమా ప్రేక్షుకుల హృద‌యాల‌ను మెప్పిస్తుంద‌ని నమ్మకంతో ఉన్నారు. ఈ సినిమా కూడా ఆగ‌స్ట్‌లోనే విడుదల అవుతుంది. మ‌ణికాంత ప‌రుశు, లోకేష్ కుమార్ ప‌రిమి, శ్యామ్ క‌ల్యాణ్, ర‌ఘువ‌ర‌న్‌, శివ కుమార్ మట్ట, అక్షయ్‌  శ్రీనివాస్‌, శ‌ర‌ణ్య సురేష్, తేజ‌స్వి రావ్‌, విషిక‌, ష‌ణ్ముకి నాగుమంత్రి ఇతర పాత్రల్లో న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి య‌దు వంశీ దర్శకుడు. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై   పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 


Also Read: హార్థిక్, నటాషా విడాకులు.. వైరల్ అవుతున్న పాత ఫొటోస్!