Prabhas - Lokesh Kanagaraj : రెబల్ స్టార్ ప్రభాస్, తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబోలో సినిమా రాబోతుందంటూ గత కొన్ని రోజులుగా వస్తోన్న వార్తలపై క్లారిటీ వచ్చింది. ఈ వార్తలు నిజమేనంటూ ఇటీవల దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. దీంతో ఈ సినిమా ఇద్దరి కెరీర్లోనూ బిగ్గెస్ట్ మూవీ అవుతుందని సినీ ప్రేక్షకులు, ప్రభాస్ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. 


'ఖైదీ', 'మాస్టర్', 'విక్రమ్' సినిమాలతో తన టాలెంట్ ఏంటో సినీ ఇండస్ట్రీకి చూపించిన లోకేష్ కనగరాజ్.. చేసింది కొన్ని సినిమాలే అయినా.. స్టార్ డైరెక్టర్ల సరసన చేరే స్థాయికి చేరుకున్నారు. ఆయన సినీ కెరీర్ లో భాగంగా తొలి ఇన్ స్టాల్ మెంట్ లో తెరకెక్కిన కార్తి 'ఖైదీ'... ఆ హీరో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత కమల్ హాసన్(Kamal Hassan) నటించిన 'విక్రమ్' ఎంత భారీ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ (LCU)ను సృష్టించుకున్న ఈ యువ దర్శకుడు, ఆ తరవాత దళపతి విజయ్‌(Thalapati Vijay) తో ‘మాస్టర్’ సినిమా చేసినా అది బాక్సాఫీస్ వద్ద మాత్రం అంతగా ఆడలేదు.


ప్రస్తుతం విజయ్ దళపతితో కలిసి రెండో సినిమాగా తెరకెక్కుతోన్న 'లియో'.. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి మూడో ఇన్‌స్టాల్‌మెంట్ వస్తోంది. ఈ క్రమంలోనే లోకేష్.. ప్రభాస్ తో సినిమా చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పటి వరకూ ఈ విషయంపై ఎలాంటి స్పష్టత రాలేదు. తాజాగా ఈ విషయంపై స్పందించిన లోకేష్ కనగరాజ్.. తాను రెబల్ స్టార్ ప్రభాస్‌(Prabhas)తో సినిమా చేయనున్నట్టు ఓ తమిళ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ‘లియో’ సినిమా పూర్తిచేసిన తరవాత ప్రభాస్‌తో చేయబోయే సినిమా స్క్రిప్ట్ వర్క్ మొదలుపెడతానని అన్నారు. దీంతో ఇప్పుడు లోకేష్ కనగరాజ్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Also Read ఐదేళ్ళ పాటు 'దిల్' రాజును ఆదుకున్న పవన్ కళ్యాణ్ 'తొలిప్రేమ'


ఇక ప్రభాస్ విషయానికొస్తే,, ఇటీవలే 'ఆదిపురుష్' సినిమా విడుదలై.. మిశ్రమ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు రూ.400కి పైగా కలెక్షన్లు వసూలు చేసింది. ప్రారంభంలో బాగానే ఉన్నా.. విడుదలైన నాలుగు రోజుల తర్వాత కలెక్షన్లు భారీగా పడిపోయాయి. ఇదిలా ఉండగా ప్రభాస్ ప్రస్తుతం 'కేజీయఫ్' దర్శకుడు ప్రశాంత్ నీల్ తో కలిసి ‘సలార్’ చేస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తరవాత సంక్రాంతికి ‘ప్రాజెక్ట్ K’తో ప్రభాస్ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమాకు ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. వైజయంతీ మూవీస్ ఈ సినిమాను నిర్మిస్తోంది. మరోవైపు, మారుతీతో చేస్తున్న కామెడీ ఎంటర్‌టైనర్ కూడా త్వరలోనే థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉంది.


Read Also మహేష్ బాబు, రాజమౌళి సినిమాకు సీక్వెల్? - క్లారిటీ ఇచ్చిన విజయేంద్ర ప్రసాద్!


Join Us on Telegram: https://t.me/abpdesamofficial