మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్, కేతికా శర్మ జంటగా నటించిన సినిమా 'రంగ రంగ వైభవంగా'. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్  నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్ రెడీ అయ్యింది. ఈ నెల 27న (సోమవారం) విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది.


Also Read : డాడీ డ్యూటీస్‌లో రాహుల్ రవీంద్రన్ - చిల్డ్రన్ ఫోటోలు షేర్ చేసిన చిన్మయి


'రంగ రంగ వైభవంగా' సినిమాలో హీరో హీరోయిన్లు ఇద్దరూ డాక్టర్లుగా కనిపించనున్నారు. ఆల్రెడీ విడుదల చేసిన ప్రచార చిత్రాల్లో బటర్ ప్లై కిస్, ఆ తర్వాత విడుదల చేసిన 'కొత్తగా లేదేంటి...' పాట ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. గిరీశయ్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి శ్యామ్ ద‌త్ సినిమాటోగ్రాఫర్. 


Also Read : 'సమ్మతమే' రివ్యూ: కిరణ్ అబ్బవరం, చాందిని చౌదరి నటించిన రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌ ఎలా ఉందంటే?