NTR Spotted new Expensive Watch At Tillu Square Success Meet : మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ కి వాచెస్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తారక్ కి రిస్ట్ కంపెనీ వాచ్ లంటే పిచ్చి. ఈ కంపెనీకి సంబంధించి మార్కెట్లో కొత్త మోడల్ వాచ్ వచ్చిందంటే వెంటనే తారక్ దాన్ని కొనుగోలు చేస్తారు. అదొక్కటే కాదు ప్రపంచంలోని అరుదైన బ్రాండ్స్ కి చెందిన వాచ్ లను ఎన్టీఆర్ కొంటుంటారు. వాటి ధరలు లక్షల్లో కాదు కోట్లల్లో ఉంటాయి. అలా ఇప్పటికే పలు సందర్భాల్లో ఎన్టీఆర్ వాచ్ కాస్ట్ తెలిసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయారు. ఇక ఇప్పుడు తాజాగా ఎన్టీఆర్ మరో లగ్జరీ వాజ్ ధరించి కనిపించడంతో ఆ వాజ్ ఖరీదు తెలిసి అభిమానులే అవాక్కైపోతున్నారు. ఇంతకీ అది ఏ కంపెనీ వాచ్? దానికి కాస్ట్ ఎంత ? పూర్తి వివరాల్లోకి వెళ్తే..


ఎన్టీఆర్ కొత్త వాచ్ ఖరీదు అన్ని కోట్లా?


జూనియర్ ఎన్టీఆర్ ఇటీవల 'టిల్లు స్క్వేర్' సక్సెస్ మీట్ కి చీఫ్ గెస్ట్ గా హాజరైన విషయం తెలిసిందే. ఈ మూవీ సక్సెస్ మీట్ లో తారక్ ప్రజెన్స్ ఫ్యాన్స్ లో జోష్ నింపితే ఆయన స్పీచ్ అయితే అందరినీ ఆకట్టుకుంది. అయితే ఈ సక్సెస్ మీట్ లో ఎన్టీఆర్ ధరించిన వాచ్ ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకర్షించింది. దాంతో సోషల్ మీడియాలో ఆ వాచ్ వివరాలు తెలుసుకొని అభిమానులు షాక్ అవుతున్నారు. 'టిల్లు స్క్వేర్' సక్సెస్ మీట్ లో ఎన్టీఆర్ ధరించిన వాచ్ 'ఆడేమార్స్ పిగెట్ రాయల్ ఓక్' బ్రాండ్ కి చెందింది. ఆ వాచ్ ధర $189,000.. మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే 1,57,32,450.. అంటే సుమారు కోటిన్నర రూపాయలు అన్నమాట. ఈ విషయం తెలిసిన నెటిజన్స్ కేవలం వాచ్ ఖరీదే కోటిన్నర అంటే అది మామూలు విషయం కాదని, ఆ వాచ్ కి పెట్టే కాస్ట్ తో సామాన్యుడి లైఫ్ సెటిలైపోద్దంటూ కామెంట్స్ చేస్తున్నారు.








 
'దేవర' ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకునేలా ఉంటుంది


'టిల్లు స్క్వేర్' సక్సెస్ మీట్ లో ఎన్టీఆర్ 'దేవర' మూవీ గురించి మాట్లాడి ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేశాడు. అంతేకాదు ఆ సినిమాలో ఓ డైలాగ్ కూడా చెప్పాడు. సినిమా కాస్త ఆలస్యమైనా కూడా అందరికీ నచ్చుతుందని, అభిమానులు కాలర్ ఎగరేసుకునేలా 'దేవర' సినిమా ఉంటుందని చెప్పి సినిమాపై అంచనాలను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాడు. 


దసరాకి రిలీజ్


కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న 'దేవర' సినిమాని రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. అందులో మొదటి భాగం 'దేవర పార్ట్-1' దసరా కానుకగా అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సముద్రం బ్యాక్ డ్రాప్ లో హై వోల్టేజ్ యాక్షన్ రివెంజ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీతో బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ ఇందులో విలన్ రోల్ చేస్తున్నారు. ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్న ఈ చిత్రానికి ఆనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు.


Also Read : ఆ జనాన్ని చూసి షాకయ్య - అప్పుడే ప్రభాస్‌లా హీరో అవ్వాలనుకున్నా: నవీన్ చంద్ర