మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR)కు ప్రేక్షకులలో ఏ స్థాయి అభిమానం ఉందనేది చెప్పడానికి ఇదొక చిన్న ఉదాహరణ. ఆయన్ను కోట్లాది మంది అభిమానిస్తున్నారు. ఎన్టీఆర్ అంటే ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నారు. అందులో గుడివాడకు చెందిన ఓ యువకుడు ఉన్నారు. అతనికి మాటలు రావు. అయినా సరే తన అభిమాన కథానాయకుడిని దగ్గర నుంచి చూడాలని 'వార్ 2' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వచ్చాడు. ఆ విషయం ఎన్టీఆర్ దృష్టికి వెళ్ళింది. అప్పుడు ఏం చేశారో తెలుసా?

మాటలు రావ్... ఇప్పుడు మాటల్లేవ్!'వార్ 2' ఈవెంట్ దగ్గర తనను దగ్గర నుంచి చూసే అవకాశం లభిస్తుందని మాటలు రాని ఓ అభిమాని వచ్చిన విషయం ఎన్టీఆర్ దృష్టికి వెళ్ళింది. అది తెలిసి అతడిని దగ్గరకు పిలిపించుకున్నారు. అభిమానితో కలిసి ఫోటో దిగారు. అంతే కాదు... హృతిక్ రోషన్ (Hrithik Roshan)తో కలిసి మరొక ఫోటో ఇచ్చారు. అభిమానుల పట్ల ఎన్టీఆర్ ఎంత బాధ్యతగా, జాగ్రత్తగా వ్యవహరిస్తారనేది చెప్పడానికి ఇది మరొక ఉదాహరణ.

Also Readతారక్ వన్ టేక్ ఫైనల్ టేక్ ఆర్టిస్ట్... హృతిక్ రోషన్ మాటలు వింటే ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గూస్ బంప్స్ పక్కా

అభిమానుల కోసం జీవితాంతం శ్రమిస్తా!కథానాయకుడిగా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్ అడుగుపెట్టి పాతికేళ్ళు. ఇప్పుడు ఆయన 'వార్ 2'తో బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెడుతున్నారు. ఆ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో అభిమానుల కోసం మరో పాతికేళ్ళు కష్టపడతానని తెలిపారు. 

''పాతికేళ్ల క్రితం 'నిన్ను చూడాలని' సినిమా మొదలైనప్పుడు అమ్మా నాన్న తప్ప నా పక్కన ఎవరూ లేరు. మొదటి సినిమా విడుదల కాకముందు ముజీబ్ అని ఓ వ్యక్తి వచ్చారు. 'నేను మీ అభిమాని' అన్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాతో ఉన్నాడు. తర్వాత నుంచి ఒక్కొక్కరుగా వచ్చారు. ఒక తల్లి కడుపున పుట్టకపోయినా నా కష్టాలు, సంతోషాల్లో తోడుగా అభిమానులు ఉన్నారు. వాళ్ళ కోసం జీవితాంతం ఇలాగే శ్రమిస్తా'' అని ఎన్టీఆర్ తెలిపారు. నందమూరి తారక రామారావు (తాతయ్య) ఆశీస్సులు ఉన్నంత వరకు తనను ఎవరూ ఆపలేరని ఆయన వ్యాఖ్యానించారు.

Also Readఎన్టీఆర్ ఇండియాలో కాలర్ ఎగరేయాలి... అదీ అభిమానుల బాధ్యత - 'వార్ 2' ఈవెంట్‌లో నాగవంశీ