Prabhas Doing a New Role in Kannappa : టాలీవుడ్ అగ్ర హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. గత ఏడాది 'సలార్' సినిమాతో కం బ్యాక్ అందుకున్న ఈ హీరో ఇప్పుడు 'కల్కి2898AD', 'రాజా సాబ్', 'స్పిరిట్' వంటి సినిమాలు చేస్తున్నాడు. ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉన్నా కూడా ఓ సినిమాలో గెస్ట్ రోల్ చేసేందుకు కమిట్ అయ్యాడు. అదే మంచు విష్ణు టైటిల్ రోల్ లో నటిస్తున్న 'కన్నప్ప'. మంచు విష్ణు డ్రీం ప్రాజెక్టుగా రాబోతున్న 'కన్నప్ప'లో ప్రభాస్ శివుడి పాత్రలో నటించబోతున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. విష్ణు కూడా ప్రభాస్ శివుడి పాత్ర చేస్తున్నాడని ఆ మధ్య చెప్పడంతో ఈ ప్రాజెక్టు పై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. అయితే ప్రభాస్ ఈ సినిమాలో శివుడి పాత్ర పోషించడం లేదట. ఆ పాత్రలో మరో స్టార్ హీరో కనిపించబోతున్నట్లు తాజా సమాచారం బయటకు వచ్చింది. మరి ప్రభాస్ కన్నప్పలో ఏ పాత్ర పోషిస్తున్నాడు? అనే వివరాల్లోకి వెళితే..


'కన్నప్ప' లో ప్రభాస్ శివుడు కాదు


'కన్నప్ప' సినిమాకి హిందీ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. ఇప్పటికే కొన్ని షెడ్యూల్స్ ని విదేశాల్లో చిత్రీకరించారు. షూటింగ్ దాదాపు చివరి దశకు వచ్చింది. సినిమాలో భారీ తారాగణం భాగమవుతున్నారు. అందులో ప్రభాస్ కూడా ఒకరు. 'కన్నప్ప'లో ప్రభాస్ శివుడి పాత్ర చేస్తున్నాడని ఇప్పటికే వార్తలు వైరల్ అయ్యాయి. కానీ అది నిజం కాదని తెలిసింది. లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం..కన్నప్పలో ప్రభాస్ శివుడిగా కాకుండా నందీశ్వరుడిగా కనిపించబోతున్నాడట. నిజానికి ఇందులో శివుడి పాత్ర చేయాలని ప్రభాస్ ని మంచు విష్ణు ఒత్తిడి చేసినప్పటికీ ప్రభాస్ ఆ భారం మోయదలుచుకోలేదని, సున్నితంగా ఆ ఆఫర్ ని తిరస్కరించాడని, ఈ క్రమంలోనే సినిమాలో నందీశ్వరుడిగా కనిపించడానికి ఒప్పుకున్నట్లు ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది.


శివుడి పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో


'కన్నప్ప' సినిమాలో ప్రభాస్ వద్దనుకున్న శివుడి పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కనిపించబోతున్నట్లు సమాచారం. అక్షయ్ కుమార్ ఇదివరకే 'ఓ మై గాడ్ 2' లో శివుడిగా కనిపించి ఆకట్టుకున్నాడు. దీంతో ఇప్పుడు 'కన్నప్ప'లో మరోసారి అదే పాత్ర చేయనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే అక్షయ్ కుమార్ షూటింగ్లో జాయిన్ కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


పార్వతీదేవిగా అనుష్క


'కన్నప్ప'లో పార్వతీదేవిగా బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ కనిపించబోతుందంటూ ఇటీవల వార్తలు వచ్చాయి. కానీ తాజా సమాచారం ప్రకారం ఆమె స్థానంలో పార్వతి దేవిగా టాలీవుడ్ జేజమ్మ అనుష్క నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈమెతో పాటు ఈ చిత్రంలో మోహన్ లాల్, శివరాజ్ కుమార్, మంచు మోహన్ బాబు, బ్రహ్మానందం తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘కన్నప్ప’ చిత్రాన్ని అవా ఎంటర్‌టైన్మెంట్, 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. స్టీఫెన్ దేవస్సీ, మణిశర్మ కలిసి సంగీతాన్ని అందిస్తున్నారు. 


Also Read : ముంబైలో ఇల్లు కొన్న పూజా హెగ్డే - దాని ఖరీదు అన్ని కోట్లా?