ఎనర్జిటిక్ హీరో నిఖిల్ (Nikhil Siddharth), దర్శకుడు చందు మొండేటి (Chandoo Mondeti) ది హిట్ కాంబినేషన్. వీళ్ళిద్దరూ చేసిన 'కార్తికేయ' ప్రేక్షకులతో పాటు విమర్శకులను ఆకట్టుకుంది. ఇప్పుడు ఆ సినిమా సీక్వెల్‌తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran) కథానాయిక. ఈ రోజు సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ విడుదల చేశారు.


'సముద్రం దాచుకున్న అతి పెద్ద సహస్యం ఈ ద్వారకా నగరం' అంటూ నిఖిల్ చెప్పిన డైలాగ్‌తో 'కార్తికేయ 2' మోషన్ పోస్టర్ విడుదల చేశారు. ఆకాశంలో మెరుపులు - ఉరుములు... పక్షులు...  మధ్యలో పడవ మీద నిఖిల్, అనుపమ, శ్రీనివాసరెడ్డి... ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ (Karthikeya2 Telugu Movie First Look) ఆసక్తికరంగా ఉన్నాయి. ఈ సినిమాలో శ్రీకృష్ణునికి సంబంధించిన చరిత్ర, ద్వారకా నగరం మీద అన్వేషణ చేసే వైద్యుడిగా నిఖిల్ కనిపించనున్నారు. 



నిఖిల్ కథానాయకుడిగా చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్న 'కార్తికేయ‌ 2' చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రి, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై టీజీ విశ్వ‌ప్ర‌సాద్, అభిషేక్ అగ‌ర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కీలక పాత్రలో నటిస్తున్నారు. జూలై 22న ప్ర‌పంచ‌ వ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సినిమాను విడుదల చేయనున్నారు. 


Also Read: కోటి రూపాయలు ఆఫర్ చేసినా పెళ్లిలో పాడలేదు - అదీ సింగర్ కేకే క్యారెక్టర్






ప్ర‌వీణ్‌, ఆదిత్యా మీన‌న్‌, తుల‌సి, స‌త్య, వైవా హ‌ర్ష‌, వెంక‌ట్‌ తదితరుల నటిస్తున్న ఈ చిత్రానికి సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల,  ఛాయాగ్రహణం: కార్తీక్ ఘట్టమనేని, సంగీతం: కాల భైరవ. 


Also Read: ప్రముఖ గాయకుడు కేకే హఠాన్మరణం - స్టేజ్‌పై ప్రదర్శన ఇస్తూనే - ప్రధాని మోదీ దిగ్భ్రాంతి!