తెలుగు - తమిళ భాషల్లో అగ్ర కథానాయికగా పేరొందిన నయనతార, తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్ కొన్ని సంవత్సరాలుగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. 'నేనూ రౌడీనే' షూటింగ్ సమయంలో ఇద్దరూ ప్రేమలో పడ్డారు. అంతే కాదు... వీళ్ళిద్దరూ సహ జీవనం చేస్తున్నారనేది చెన్నై కోడంబాక్కమ్ వర్గాల గుసగుస. అయితే... తామిద్దరం పెళ్లి చేసుకున్నట్టు నయనతార గానీ, విఘ్నేష్ శివన్ గానీ చెప్పలేదు. గుట్టు చప్పుడు కాకుండా పెళ్లి చేసుకున్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.


ఇటీవల తమిళనాడులోని ఓ దేవాలయంలో అమ్మవారిని దర్శించుకున్న నయన్, ప్రత్యేక పూజలు చేశారు. ఆమెతో పాటు విఘ్నేష్ శివన్ కూడా ఉన్నారు. దేవాలయం నుంచి నయనతార వస్తున్న సమయంలో ఒకరు వీడియో తీశారు. అందులో ఆమె నుదుట సింధూరం ఉంది. సాధారణంగా పెళ్లైన మహిళలు మాత్రమే నుదుట సింధూరం ధరిస్తారు. అందువల్ల, నయనతార పెళ్లై ఉంటుందని నెటిజన్లు భావిస్తున్నారు.






Also Read: కమల్ హాసన్ 'విక్రమ్' విడుదల తేదీ ఖరారు, ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు వస్తుందంటే?


ప్రేమలో ఉన్న విషయాన్ని వీళ్ళిద్దరూ ఎప్పుడూ దాచలేదు. నయనతారతో దిగిన ఫొటోలను విఘ్నేష్ శివన్ తరచూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. కేరళలో ఆమె ఇంటికి వెళ్లి వస్తున్నారు. విఘ్నేష్ శివన్ ఫ్యామిలీతో నయనతార కలివిడిగా ఉంటున్నారు. ఇటీవల ఓ ఉంగరం ఫొటోను విఘ్నేష్ శివన్ పోస్ట్ చేశారు. దాంతో ఇద్దరికీ నిశ్చితార్థం జరిగి ఉంటుందని ప్రేక్షకులు ఊహించారు. అయితే... పెళ్లి చర్చ అనూహ్యంగా తెరపైకి వచ్చింది.


Also Read: 'మారన్' రివ్యూ: కార్తీక్, ధనుష్ కలిసి ఇలా చేశారేంటి?