టాలీవుడ్ యంగ్ సెన్షేషన్ నవీన్ పోలిశెట్టి. జాతిరత్నం సినిమా హిట్ తో క్రేజీ హీరోగా మారాడు. ఆ మూవీ తరువాత అతనికి చాలా ఆఫర్లు వరుసకట్టాయి. ఇప్పటికే స్వీటీ అనుష్కతో ఓ సినిమా కన్ఫర్మ్ చేశాడు. ఇప్పుడు నవీన్ కొత్త సినిమాపై మరో క్రేజీ అప్డేట్ వచ్చింది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ తన ట్విట్టర్ ఖాతాలో నవీన్ పోలిశెట్టితో సినిమా చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ కు చెందిన ప్రొడక్షన్ హౌస్ ‘ఫార్చున్ 4 సినిమాస్’తో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నట్టు తెలిపింది. ఈ చిత్రానికి నాగవంశీతో పాటూ త్రివిక్రమ్ సతీమణి సౌజన్య నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఈ సినిమా ద్వారా కళ్యాణ్ శంకర్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. నవీన్ పోలిశెట్టికి తొలిసారి పెద్ద బ్యానర్ లో చేసే అవకాశం దక్కింది. 


గతంలోనే సితారా ఎంటర్ టైన్ మెంట్ తో నవీన్ పోలిశెట్టి సినిమా చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే కథలో కొన్ని మార్పులు చేయాల్సిందిగా నవీన్ కోరారని సమాచారం. ఆ మార్పులు చేసినప్పటికీ కథ కుదరలేదని, అందుకే ఆ ప్రాజెక్టు నుంచి నవీన్ తప్పుకున్నారని టాలీవుడ్ లో టాక్ వినిపించింది. అంతేకాదు సితారా సంస్థ నుంచి తీసుకున్న నాలుగు కోట్ల రూపాయలను కూడా నవీన్ తిరిగి ఇచ్చేశాడని కూడా వార్తలు వచ్చాయి. కానీ వీటిపై ఎలాంటి స్పష్టత లేదు. ఇప్పుడు సితారా ఎంటర్ టైన్ మెంట్స్ అధికారికంగా ప్రకటించడంతో... వారు నవీన్ తో సినిమా చేయడం ఖాయం అయ్యింది. 



నవీన్ పోలిశెట్టి 2012లో లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాతో కెరీర్ మొదలుపెట్టాడు. 2019లో ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ సినిమాలో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా మంచి టాక్ సంపాదించుకుంది. 2020లో విడుదలైన జాతి రత్నాలు అతడిని క్రేజీ హీరోగా మార్చింది. 


Also read: మన కూతుళ్లు సురక్షితమేనా... కడుపు తరుక్కుపోతోంది... మహేష్ బాబు భావోద్వేగ ట్వీట్
Also read: సుధారెడ్డి... అంతర్జాతీయ వేదికపై మెరిసిన తెలుగందం... అసలు ఎవరీమె?
Also read: ఎక్కువ కాలం జీవించాలనుకుంటున్నారా? అయితే వీటిని తగ్గించండి...