Notice to Hero Raj Tarun: గతవారం రోజులుగా రాజ్‌ తరుణ్‌-లావణ్య కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. అతడి ప్రియురాలు లావణ్య అందించని ఆధారాల మేరకు పోలీసులు రాజ్‌ తరుణ్‌తో పాటు హీరోయిన్‌ మాల్వీ మల్హోత్రాలపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఏ1 నిందితుడిగా రాజ్‌ తరుణ్‌, ఏ2గా మాల్వీ మల్హోత్రాను చేర్చుతూ నార్సింగ్‌ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. తాజాగా ఈ కేసులో రాజ్‌ తరుణ్‌కు నార్సింగ్‌ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో విషయమై విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశిస్తూ BNSS 45 కింద పోలీసులు నోటీసులు ఇచ్చారు.


ప్రస్తుతం రాజ్‌ తరుణ్‌ ఎక్కడ ఉన్నాడనేది తెలియని పరిస్థితులు. లావణ్య ఫిర్యాదు అనంతరం కనిపించిన రాజ్‌ తరుణ్‌ ఆ తర్వాత మళ్లీ మీడియా ముందుకు రాలేదు. ప్రస్తుతం అతడు ఎక్కడ ఉన్నాడో తెలియని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఎక్కడ ఉన్నా జూలై 18 లోపల పోలీసుల ఎదుట హాజరు అవ్వాలని ఆదేశిస్తూ పోలీసులు నోటీసులు అందజేశారు. ఈ మేరకు నార్సింగ్‌ పోలీసులు BNSS 45 కింద రాస్తారోకో నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం ఈ వార్త ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా నిలిచింది. కాగా రాజ్‌ తరుణ్‌ హీరోయిన్‌ మాల్వీ మల్హోత్రాతో ఎఫైర్‌ పెట్టుకుని తనని దూరం పెడుతున్నాడంటూ జూలై 5న కోకాపేటకు చెందిన లావణ్య నార్సింగ్‌ పోలీసులను ఆశ్రయించింది.


తామిద్దరం పదకొండేళ్లుగా రిలేషన్‌లో ఉన్నామని, పెళ్లి కూడా చేసుకున్నామని తన ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాదు రాజ్‌ తరుణ్‌ తనకు అబార్షన్‌ కూడా చేయించాడంటూ ఆరోపించింది. హీరోయిన్‌ మాల్వీ మోజులో పడి తనకు దూరంగా ఉంటున్నాడని, డ్రగ్‌ కేసులో కూడా తనని ఇరికించాడంటూ ఆరోపణలు చేసింది. రాజ్‌ని వదిలిపెట్టమని హీరోయిన్‌ మాల్వీ, ఆమె సోదరుడు తనని బెదిరించారని తన ఫిర్యాదు పెర్కొంది. ఇక మాల్వీ ఆరోపణలపై వెంటనే స్పందించిన రాజ్‌ తరుణ్‌ ఆమెకు మస్తాన్‌ సాయి అనే వ్యక్తితో ఎఫైర్ ఉందని సంచలన ఆరోపణలు చేశాడు. అంతేకాదు అతడితో ఆమె సహజీవనం కూడా చేస్తుందని చెప్పాడు. అయితే లావణ్యతో రిలేషన్‌లో ఉన్న మాట నిజమేనని, కానీ ఆమె అలవాట్లు చూసి ఆమెకు దూరంగా ఉంటున్నానని చెప్పాడు. 



ఇక రాజ్‌ తరుణ్‌ కామెంట్స్‌తో ఈ కేసులో ఆధారాలు చూపించాలని నార్సింగ్‌ పొలీసులు లావణ్యకు తిరిగి నోటీసులు ఇచ్చారు. ఇటీవల లావణ్య పోలీసులు 170 ఫోటోలు, వీడియోలతో పాటు పలు కీలక ఆధారాలను అందించింది. అంతేకాదు ప్రెష్‌గా ఎఫ్‌ఐర్‌ కూడా నమోదు చేసింది. ఇక అందించిన ఆధారాల మేరకు పోలీసులు రాజ్‌ తరుణ్‌పై కేసు, హీరోయిన్‌ మాల్వీ మల్హోత్రా, ఆమె సోదరుడుపై కేసు నమోదు చేశారు. అయితే ప్రియురాలు ఆరోపణలతో మీడియా ముందుకు వచ్చిన రాజ్‌ తరుణ్‌ ఆ తర్వాత ఎక్కడ కనిపించడం లేదు. అంతేకాదు ఆమె ఆరోపణలపై కూడా స్పందించడం లేదు. ఈ నేపథ్యంలో పోలీసులు రాజ్‌ తరుణ్‌ని విచారణక రావాల్సిందిగా ఆదేశిస్తూ నోటీసులు ఇచ్చారు.


Also Read: అట్లీ అవుట్‌, అల్లు అర్జున్‌ని కలిసిన మరో స్టార్‌ డైరెక్టర్‌! - ఎవరంటే..!