Nandini Rai About Her Fearful Experience In Goa Tour: టాలీవుడ్ హీరోయిన్లలో తెలుగమ్మాయి నందిని రాయ్. ఆమె తెలుగుతో పాటు హిందీ సినిమాల్లో నటించినా అంతగా గుర్తింపు రాలేదు. బిగ్ బాస్ సీజన్ 2లోనూ పాల్గొన్నారు. అయితే.. ఆమె మూవీస్ కన్నా సోషల్ మీడియా ద్వారానే ఎక్కువ పాపులారిటీ సంపాదించుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నందిని రాయ్ గోవాలో తనకు ఎదురైన భయానక అనుభవం గురించి షేర్ చేసుకున్నారు.
'నాపై చేతబడి జరిగింది'
తన ఫ్రెండ్స్తో కలిసి గోవాకు వెళ్లిన టైంలో తనపై చేతబడి జరిగిందంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు నందినీ రాయ్. '2017, 18 ఆ టైంలో నా కెరీర్ చాలా డల్ అయిపోయింది. నేను ఓ దశలో డిప్రెషన్లో ఉన్నాను. ఏం జరుగుతుందో నాకు అర్థం అయ్యేది కాదు. నేను నా ఫ్రెండ్స్ తో గోవాకు వెళ్లిన టైంలో ఓ నెగిటివ్ ఎనర్జీ నన్ను కమ్మేసింది.
గోవాలో ఫ్రెండ్స్తో కలిసి పార్టీ అటెండ్ చేశాను. బీచ్ వద్ద హ్యాపీగా అందరం హ్యాంగ్ అవుట్ అవుతున్నాం. వాటర్లో ఓ క్లాత్ నా కాలికి తగిలితే దాన్ని విదిలించేశాను. మళ్లీ అది కాలికి తగలడంతో క్లాత్ విప్పి చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయాను. ఎవరో ఎవరికో చేతబడి చేశారు. ఆ క్లాత్లో 2 బొమ్మలు, మహిళ జుట్టు, ఆ బొమ్మలకు సూదులు గుచ్చేసి ఉన్నాయి. అలాంటివి ముట్టుకోకూకడదట. అది చూసి నాకు చాలా భయం వేసింది. అవి తీసి చూడడంతో నాలో భయం పెరిగిపోయింది.' అని నందినీ అన్నారు.
Also Read: డ్రగ్స్ కోసం సపరేట్ బడ్జెట్, రూమ్స్... మాలీవుడ్లో ఏం జరుగుతోంది? తేనె తుట్టెను కదిపిన మహిళా నిర్మాత
డిప్రెషన్లోకి వెళ్లిపోయా
ఆ ఘటన తర్వాత ఇంటికి వచ్చి చాలా భయపడ్డానని నందిని రాయ్ అన్నారు. ఇంట్లో వారికి ఎవరికీ ఏమీ చెప్పలేదని చెప్పారు. 'జ్వరంతో పాటు ఇతర అనారోగ్య సమస్యలతో బాధ పడ్డాను. ఎందుకు భయపడుతున్నానో తెలియదు. ఆస్తమా లాంటి లక్షణాలు కూడా కనిపించాయి. నిద్ర పట్టేది కాదు. రేపు అనేది ఉంటుందా? అనే రేంజ్లో డిప్రెషన్లోకి వెళ్లిపోయా. ఓ దశలో నా తర్వాత నా వాళ్లు ఏమైపోతారో అనే ఆలోచనలు వచ్చేసేవి. బహుశా నా కెరీర్లో సక్సెస్ రాకపోవడానికి ఇదే కారణం. ఆ నెగిటివ్ ఎనర్జీ నుంచి బయటపడేందుకు నాకు రెండేళ్లు పట్టింది. ఆ టైంలో నేను ఏ మూవీస్ కూడా చేయలేకపోయాను.' అని చెప్పారు. ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
మూవీస్, బిగ్ బాస్ షోలో పాల్గొన్నా నందిని రాయ్కు అనుకున్నంత అవకాశాలు రాలేదు. '040' మూవీతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చారు నందిని రాయ్. ఆ తర్వాత మాయ, మోసగాళ్లకు మోసగాడు, సిల్లీ ఫెలోస్ వంటి చిత్రాల్లో నటించారు. విజయ్ 'వారసుడు', శ్రీసింహా కోడూరి 'భాగ్ సాలే', ఆది సాయికుమార్ 'సీఎస్ఐ సనాతన్' వంటి మూవీస్లో నటించి మెప్పించారు. మెట్రో కథలు, పంచతత్ర కథలు వంటి వెబ్ సిరీస్ల్లోనూ నటించారు. బిగ్ బాస్ షో ఆమెకు గుర్తింపు తెచ్చింది.