టాలీవుడ్ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తానా సభలో పాల్గొనేందుకు ఇటీవల అమెరికా వెళ్ళిన విషయం తెలిసిందే. ఈ మేరకు బాలయ్య తన సతీమణి వసుంధర దేవి, మనవడితో కలిసి అమెరికా వెళ్లారు. న్యూ జెర్సీలోని జెఎఫ్ కె విమానాశ్ర యంలో ఈ సందర్భంగా బాలయ్యకు ప్రతినిధులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. వాటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కాగా అమెరికాలోని పెన్సిల్వేనియాలో తానా మహాసభలు ఎంతో గ్రాండ్ గా జరుగుతున్నాయి. మూడు రోజుల పాటు జరిగిన ఈ సభకు తెలుగు రాష్ట్రాలకు చెందిన సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.


ఈ సభలో ఎన్టీఆర్ కి ఘన నివాళులు అర్పించేందుకు నిర్వాహకులు ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ ప్రసంగిస్తూ.. తెలుగు వారు ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా సరే తమ సత్తా చాటుతున్నారని ఈ సందర్భంగా  పేర్కొన్నారు. ఈ సభలో మహానటుడు ఎన్టీఆర్ కి నివాళి అర్పించేందుకు ప్రత్యేక కార్యక్రమం చేపట్టడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఇందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన సభ నిర్వాహకులకు తన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని బాలయ్య అన్నారు. తానా క్యాన్సర్ క్యాంపులు నిర్వహించడం, బసవతారకం ఆసుపత్రికి సహాయాన్ని అందిస్తుండడం ఎంతో గొప్ప విషయమని బాలకృష్ణ కొనియాడారు. 


బాలయ్య సినిమాల విషయానికొస్తే.. ఈ ఏడాది ఆరంభంలో 'వీర సింహారెడ్డి' సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'భగవంత్' కేసరి అనే సినిమా చేస్తున్నారు. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా, యంగ్ హీరోయిన్ శ్రీల మరో కీలక పాత్రలో కనిపించనుంది. ఇటీవల బాలయ్య పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన టీజర్ ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ ని అందుకుంది. టీజర్ తోనే సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెంచేశారు మేకర్స్. ఈ క్రమంలోనే నందమూరి బాలకృష్ణ తో పాటు ప్రముఖ సంగీత దర్శకులు ఇళయరాజా, హీరోయిన్ శ్రీలీల తదితరులు ఈ సభలో పాల్గొన్నారు.


ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ సినిమాని నిర్మిస్తుండగా.. ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా పూర్తయిన వెంటనే ఇటీవల వాల్తేరు వీరయ్య సినిమాతో భారీ హిట్ అందుకున్న యంగ్ డైరెక్టర్ బాబి తో తన తదుపరిచిత్రాన్ని చేయబోతున్నారు బాలయ్య. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చిన విషయం తెలిసిందే.


Also Read : రాజమౌళి ‘మహాభారతం’ కన్ఫార్మ్, ఆ మూవీ తర్వాత సెట్స్ పైకి - విజయేంద్ర ప్రసాద్ వెల్లడి




Join Us on Telegram: https://t.me/abpdesamofficial