Nagababu About Pawan Kalyan : ప్రస్తుతం ఏపీ ఎలక్షన్స్ మూవీలో కంటే ఎక్కువ ట్విస్ట్​లతో ముందుకు వెళ్తున్నాయి. పైగా ఈ సారి సినితారాలు కూడా ఎలక్షన్​లో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాలుపంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించిన ప్రతీ ఒక్క అప్డేట్‌ గురించి ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తితో చూస్తున్నారు. నాయకుల ప్రచారాలను ఫాలో అవుతున్నారు. ఆఖరికి సినీ సెలబ్రిటీలు సైతం నాయకులకు సపోర్ట్ చేయడానికి ప్రచారాల్లో పాల్గొనడానికి ముందుకొస్తున్నారు. ముఖ్యంగా చాలామంది ప్రజల దృష్టి పిఠాపురంపైనే ఉంది. అక్కడ నుండే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో పోటీకి దిగుతున్నారు. ఇప్పటికే ఆయనకు సపోర్ట్‌గా చాలామంది సెలబ్రిటీలతో పాటు మెగా ఫ్యామిలీకి కూడా ప్రచారానికి రాగా.. తాజాగా నాగబాబు ఆయనకు సపోర్ట్ చేస్తూ ఒక ఎమోషనల్ పోస్ట్‌ను షేర్ చేశారు.


పార్టీలో యాక్టివ్..


పవన్ కళ్యాణ్ ఏం చేసినా తన వెంట నేను ఉన్నానంటూ నిలబడతారు నాగబాబు. సినిమాలను వదిలేసి రాజకీయాలవైపు వెళ్లాలి అనుకున్నప్పుడు కూడా తన అన్నలుగా చిరంజీవి, నాగబాబు సపోర్ట్ చేశారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో బిజీ అయినా.. నాగబాబు మాత్రం జనసేన పార్టీ స్థాపించినప్పటి నుండి పార్టీలో యాక్టివ్ పాత్ర పోషిస్తూనే ఉన్నారు. ఇక ఇప్పుడు ఎన్నికల ప్రచార సమయంలో కూడా పవన్ వెన్నంటే ఉంటున్నారు నాగబాబు. ఈసారి ప్రచారాల్లో పవన్ కళ్యాణ్‌కు దక్కుతున్న ఆదరణ చూస్తుంటే గెలుపు ఖాయమని కొందరు అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తుండగా.. నాగబాబు కూడా అదే ఉద్దేశ్యంతో ఒక స్పెషల్ ఫోటోతో ఉన్న పోస్ట్‌ను షేర్ చేశారు.


నీ గెలుపు సిద్దం..


‘నిన్ను నమ్మని వాళ్ల కోసం కూడా ఎందుకు నిలబడతావ్ అని అడిగితే చెట్టుని చూపిస్తాడు అది నాటిన వాళ్లకి మాత్రమే నీడనిస్తుందా అని.. నీతో నడవని వాళ్ల కోసం కూడ ఎందుకు నిందలు మోస్తావ్ అని అడిగితే వర్షాన్ని చూపిస్తాడు తనకి మొక్కని రైతు కంటిని తడపుకుండా పంటనే తడపుతుందని.. అప్పటి నుండి అడగడం మానేసి ఆకాశం లాంటి అతని ఆలోచనా విశాలతని అర్ధం చేసుకోవడం మొదలుపెట్టాను. సేనాని.. మీరు చిందించిన ప్రతి చెమట బొట్టు రేపటితరం ఎక్కబోయే మార్గదర్శపు మెట్టు కాబోతుంది.. కూటమి రాబోతుంది. సిరా పూసిన సామన్యుడి వేలి సంతకంతో నీ గెలుపు సిద్దమైంది’ అంటూ పవన్ కళ్యాణ్‌కు గెలుపు ఖాయమని నమ్మకం వ్యక్తం చేశారు నాగబాబు.






మెగా ఫ్యామిలీ సపోర్ట్..


నాగబాబు చేసిన ఈ పోస్ట్‌కు పవన్ కళ్యాణ్ ఫాలోవర్స్ తెగ కామెంట్లు పెడుతున్నారు. నిజంగానే ఈసారి గెలుపు పవన్ కళ్యాణ్‌దే అని, కూటమి గెలుస్తుంది అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక మెగా హీరోలు వైష్ణవ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ లాంటి హీరోలు ఇప్పటికే ప్రచారాల్లో యాక్టివ్‌గా పాల్గొంటూ ఉండగా.. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సైతం పిఠాపురంలో అడుగుపెట్టి నేరుగా తన బాబాయ్ పవన్ కళ్యాణ్‌కు మద్దతునిచ్చాడు. దీన్నిబట్టి చూస్తే సినీ సెలబ్రిటీల నుండి పవన్ కళ్యాణ్‌కు దక్కుతున్న సపోర్ట్ రోజురోజుకీ పెరిగిపోతున్నట్టు తెలుస్తోంది. దీంతో ఏపీ ఎన్నికలపై ప్రజల్లో మరింత ఉత్కంఠ మొదలయ్యింది.



Also Read: ఆటోలో షూటింగ్ వెళ్లిన శృతి హాసన్ - మరీ ఇంత డెడికేషనా? అంటూ నెటిజన్ల ప్రశంసలు