Manam Movie Re Release News: అక్కినేని ఫ్యామిలీకి, ప్రేక్షకులకు 'మనం' వెరీ వెరీ స్పెషల్ ఫిల్మ్. అక్కినేని నాగేశ్వర రావు, ఆయన తనయుడు కింగ్ నాగార్జున, మనవడు నాగ చైతన్య హీరోలుగా నటించడం దీని ప్రత్యేకత. ఇందులో అఖిల్ ఓ చిన్న అతిథి పాత్రలో కనిపించారు. ఈ సినిమా విడుదలై ఇవాళ్టికి పదేళ్లు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దేవి థియేటర్లో స్పెషల్ షో వేశారు. 


'మనం' మ్యూజిక్ కూడా హిట్టే
'మనం' విజయంలో పాటలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. అనూప్ రూబెన్స్ (Anup Rubens) సంగీతం అందించిన ఆ సాంగ్స్ వింటుంటే ఇప్పటికీ ఫ్రెష్ ఫీలింగ్, ఓ విధమైన హాయి కలుగుతుంది. అనూప్ రూబెన్స్ కీ బోర్డు మీద 'మనం' సాంగ్స్ ప్లే చేసిన వీడియో అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోసారి ఆయన పేరు మార్మోగుతోంది. మరొక్కసారి ఆయన పాటల్ని గుర్తు చేసుకుంటున్నారు.






అక్కినేని ఫ్యామిలీ, అనూప్ రూబెన్స్ కాంబినేషన్ సూపర్ డూపర్ హిట్. 'సోగ్గాడే చిన్ని నాయనా', 'బంగార్రాజు' సినిమాలకు ఆయన చార్ట్ బస్టర్ ఆల్బమ్స్, రీ రికార్డింగ్ ఇచ్చారు. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన 'హార్ట్ ఎటాక్', 'టెంపర్' సినిమాలకూ మంచి మ్యూజిక్ ఇచ్చారు. నితిన్ 'ఇష్క్', 'గుండెజారి గల్లంతయ్యిందే' సినిమాలతో పాటు ఆది సాయి కుమార్ 'ప్రేమ కావాలి', రానా దగ్గుబాటి 'నేనే రాజు నేనే మంత్రి', యాంకర్ ప్రదీప్ హీరోగా నటించిన '30 రోజుల్లో ప్రేమించడం ఎలా?' వంటి హిట్ సినిమాలకు అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించారు. అయితే, కొన్ని రోజులుగా ఆయన పేరు వినిపించడం లేదు. ఇప్పుడు 'మనం' రీ రిలీజుతో అనూప్ సాంగ్స్ వినడం మొదలు పెట్టారు. ప్రస్తుతం ఆయన ఏయే సినిమాలు చేస్తున్నారో తెలుసా?


అనూప్ రూబెన్స్ అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమిటంటే?
Anup Rubens Upcoming Telugu Movies: యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా చేస్తున్న ఓ పాన్ ఇండియా చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. దాంతో పాటు మాస్ మహారాజా రవితేజ సోదరుని కుమారుడు మాధవ్ హీరోగా పరిచయం అవుతున్న సినిమాకు కూడా ఆయనే మ్యూజిక్ డైరెక్టర్. దానికి గౌరీ రోణంకి దర్శకురాలు.


Also Readమలయాళ సినిమా టర్బో రివ్యూ: మమ్ముట్టి యాక్షన్ కామెడీ ఎలా ఉందంటే?


'సుబ్రహ్మణ్యపురం' విజయం తర్వాత కథానాయకుడు సుమంత్, దర్శకుడు సంతోష్ జాగర్లపూడి కలయికలో వస్తున్న 'వారాహి' సినిమాకు కూడా అనూప్ మ్యూజిక్ చేస్తున్నారు. ఆది సాయి కుమార్‌ హీరోగా వీరభద్రం చౌదరి తెరకెక్కిస్తున్న 'కృష్ణ ఫ్రమ్ బృందావనం', ఆకాష్ పూరి హీరోగా విజయ్ కుమార్ కొండా దర్శకత్వం వహిస్తున్న సినిమాలకు ఆయన పని చేస్తున్నారు. ఇవన్నీ సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్. 2024 ఇయర్ ఎండ్, 2025లో ఆయన నుంచి మినిమమ్ డజను సినిమాలు రానున్నాయి.


Also Readమూడు రోజులు... రోజుకు ఐదు గంటలు... బుజ్జి ఈవెంట్ కోసం ప్రభాస్ కష్టం!