కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ - లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ మూవీ 'లియో'(Leo) మరి కొద్ది రోజుల్లోనే థియేటర్స్ లో సందడి చేయబోతోంది. ఈ మూవీ కోసం విజయ్ ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. చెన్నై బ్యూటీ త్రిష హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలను నెలకొన్నాయి. ఫ్యాన్స్ అయితే లియో కోసం వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి ఇటీవల ట్రైలర్ విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేసింది. మరోవైపు దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఇప్పటికే కోలీవుడ్లో ఈ మూవీ ప్రమోషన్స్ ని మొదలుపెట్టి వరుస ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.


ఆ ఇంటర్వ్యూల్లో సినిమా గురించి కొత్త కొత్త విషయాలు తెలుపుతూ సినిమాపై అంచనాలను తారస్థాయికి తీసుకెళ్తున్నాడు. ఇటీవల పలు ఇంటర్వ్యూల్లో 'లియో' మూవీలో రామ్ చరణ్ సర్ ప్రైజ్ ఎంట్రీ ఉండబోతుందని, కమల్ హాసన్ కూడా లియో మూవీలో గెస్ట్ రోల్ చేస్తున్నారని ఇలా రకరకాల వార్తలు వినిపిస్తూ వస్తున్నాయి. వీటిపై లోకేష్ కనగరాజ్ ప్రత్యక్షంగా నోరు విప్పకపోయినా పరోక్షంగా ఈ సినిమాలో ఎవ్వరు ఊహించని విధంగా సర్ ప్రైజ్ లు ఉంటాయని చెప్పడం ఆ వార్తలకు మరింత బలం చేకూరింది. ఈ విషయం కాస్త పక్కన పెడితే.. లియో ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించిన సాలిడ్ అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది.


'లియో' మూవీ తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాదులో గ్రాండ్ గా నిర్వహించడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. అంతేకాకుండా ఈవెంట్ కి దళపతి విజయ్ రావట్లేదని, చీఫ్ గెస్ట్ లుగా దర్శకుడు లోకేష్ కనగరాజ్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ లతో పాటు చిత్ర బృందం పాల్గొనబోతుందని టాక్ వినిపిస్తోంది. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ లో అనిరుద్ లైవ్ పెర్ఫార్మెన్స్ కూడా ఉండబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. వచ్చేవారం హైదరాబాదులో 'లియో' తెలుగు ప్రీరిలీజ్ ఈవెంట్ ఉండబోతుందని అంటున్నారు. ఈ న్యూస్ తో టాలీవుడ్ విజయ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. అయితే దీనిపై మేకర్స్ ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయాల్సి ఉంది.


నిజానికి లియో తమిళ ప్రీరిలీజ్ ఈవెంట్ ను మొదట మలేషియాలో నిర్వహిస్తామని చిత్ర బృందం ప్రకటించింది. అయితే విదేశాల్లో ఈవెంట్ ను నిర్వహించేందుకు హీరో విజయ్ నిరాకరించారు. దీంతో ఆ ఈవెంట్ ను తమిళనాడులో సెప్టెంబర్ 30న నిర్వహించబోతున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ అధికారికంగా తెలిపింది. కానీ ఆ ఈవెంట్ ని కూడా క్యాన్సల్ చేస్తున్నట్లు రీసెంట్ గా మేకర్స్ ప్రకటించడం అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా తెరకెక్కిన 'లియో' మూవీలో బాలీవుడ్ సీనియర్ యాక్టర్ సంజయ్ దత్, యాక్షన్ కింగ్ అర్జున్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రియా ఆనంద్, మన్సూర్ అలీ ఖాన్ కీలకపాత్రలు పోషిస్తుండగా సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్ పై లలిత్ కుమార్ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు.


Also Read : శ్రీలీలకి ఉన్నంత క్లారిటీ నాకు లేదు - ఈ జనరేషన్ హీరోయిన్స్ ఆమెలా ఉంటే బాగుంటుంది, కాజల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!







Join Us on Telegram: https://t.me/abpdesamofficial