Karthi 26 Pooja Ceremony: తెలుగులో మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్న తమిళ హీరోలలో కార్తీ ఒకరు. గతేడాది తన సిల్వర్ జూబ్లీ మూవీ 'జపాన్' తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వర్సటైల్ యాక్టర్.. ఇప్పుడు తన 26వ చిత్రానికి కొబ్బరికాయ కొట్టారు. నలన్‌ కుమారస్వామి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. కొన్ని నెలల క్రితమే ఈ ప్రాజెక్ట్ పై వార్తలు వెలువడగా, మేకర్స్ తాజాగా అధికారికంగా ప్రకటించారు. 


'Karthi 26' చిత్రాన్ని స్టూడియో గ్రీన్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాని చెన్నైలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. ఈ వేడుకకు కార్తీ సోదరుడు హీరో సూర్య, తండ్రి శివ కుమార్ ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు. ముహూర్తపు సన్నివేశానికి సూర్య క్లాప్ కొట్టి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు. దీనికి సంబంధించిన వీడియోను మేకర్స్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.



Karthi 26 విభిన్నమైన కథాంశంతో రూపొందనున్న వినోదాత్మక చిత్రం అని తెలుస్తోంది. దీనికి 'వా వాతియారే' అనే టైటిల్ పరిశీలనలో ఉంది. కార్తీ ఇందులో దివంగత నటుడు, రాజకీయ నేత ఎంజీ రామచంద్రన్‌ వీరాభిమానిగా నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు పూజా కార్యక్రమాల వీడియోలో MGR ఫోటో దగ్గర క్లాప్‌ బోర్డ్‌ పెట్టి ఉంచడానికి బట్టి ఇది నిజమేనని స్పష్టం అవుతోంది.


Also Read: తల్లి మీద ప్రేమతో పేరు మార్చుకున్న మెగా హీరో!


ఇందులో కార్తీ సరసన ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. వారియర్, కస్టడీ వంటి బైలింగ్విల్ చిత్రాల తర్వాత ఆమె నటిస్తున్న స్ట్రెయిట్ తమిళ్ మూవీ ఇది. దీనిపై మేకర్స్ సైడ్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ చిత్రంలో గౌతమ్ కార్తీక్ , సత్యరాజ్, ఆనందరాజ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ టైటిల్‌ & ఫస్ట్‌ లుక్‌ ను విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ తెలియజేసింది. స్టూడియో గ్రీన్ సంస్థ నుంచి రాబోతున్న 27వ సినిమా ఇది. కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న 'కార్తీ 26' చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం సమకూర్చనున్నారు. దినేష్ బి. కృష్ణన్ సినిమాటోగ్రఫీ.. లియో జాన్ పాల్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించనున్నారు.


ఇకపోతే 'యుగానికొక్కడు' 'ఆవారా' 'నా పేరు శివ' 'ఖాకీ' 'ఖైదీ' వంటి డబ్బింగ్ సినిమాలతో తెలుగు ఆడియన్స్ ను అలరించిన కార్తీ.. 'ఊపిరి' వంటి స్ట్రెయిట్ తెలుగు సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. సర్దార్, పొన్నియన్ సెల్వన్ 1 & పొన్నియన్ సెల్వన్ 2 చిత్రాలతో విజయాలు సాధించారు. అయితే తన కెరీర్ లో మైలురాయి 25వ చిత్రంగా వచ్చిన 'జపాన్' మూవీ తెలుగు, భాషల్లో నిరాశ పరిచింది. దీంతో ఈసారి ఎలాగైనా హిట్టు కొట్టాలని 'వా వాతియారే' సినిమాతో వస్తున్నారు. దీని తర్వాత తన 27వ చిత్రాన్ని ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో చేయనున్నట్లు సమాచారం. ఈ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాకి 'మే అళగన్' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. ఇదే క్రమంలో సెల్వరాజ్ దర్శకత్వంలో 'కార్తీ 28' సినిమా తెరకెక్కునున్నట్లు తెలుస్తోంది. 


Also Read: 'బంగారం' హీరోయిన్ వెడ్డింగ్ కార్డ్ వైరల్‌ - కాబోయే వరుడు ఎవరంటే?