Jagapathi Babu Cheated by a Real Estate Company: విలక్షణ నటుడు జగపతి బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం పవర్ఫుల్‌ విలన్‌ రోల్స్‌ చేస్తూ ఆడియన్స్‌ని అలరిస్తున్నారు. ఒకప్పుడు హీరో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ సినిమాలు చేస్తూ ఎంతోమంది ఫ్యామిలీ ఆడియన్స్‌ని పొందారు. ఇప్పుడు విలన్‌గానూ తనదైన విలక్షణ నటనతో ఆడియన్స్‌ని మెప్పిస్తున్నారు. ఇక జగపతి బాబుకి ఇండస్ట్రీలో సపరేట్‌ ఫ్యాన్‌ బేస్‌ ఉందని చెప్పాలి.


వెండితెరపై ఆయన మ్యానరిజం, యాక్టింగ్‌ స్కిల్స్‌, స్టైల్‌కి థియేటర్లో ఈళలు పడాల్సిందే. సినిమాల్లో స్ట్రిక్ట్‌ రోల్స్‌, విలన్‌ పాత్ర చేస్తూ ఉండే జగపతి బాబు వ్యక్తిగతం విషయంలో గొప్యత పాటిస్తుంటారు. ఎలాంటి విషయంలో అయినా మోహమాటం లేకుండా తన అభిప్రాయం చెబుతుంటారు. పొలిటికల్‌ అయినా, సామాజాకి అంశాలైనా తన గోంతుని వినిపిస్తుంటారు. అలా ప్రతి విషయంలో చాలా ఖచ్చితంగా ఉండే ఆయన కొందరి చేతుల్లో మోసపోయారట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పడం అందరిని సర్‌ప్రైజ్‌ చేసింది.


ఈ మేరకు ఆయన తన ఇన్‌స్టా స్టోరీ ఓ వీడియోలో షేర్‌ చేశారు. అందులో తాను ఓ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ చేతిలో మోసపోయానంటూ చెప్పుకొచ్చారు. "ఇటీవల రియల్‌ ఎస్టేట్‌ మోసాలు ఎక్కువ అవుతున్నాయి. తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి కూడా ఇదే విషయంలో హెచ్చరించారు. ఇటీవల నేను ఓ రియల్‌ ఎస్టేట్‌ యాడ్‌లో నటించాను. నన్ను కూడా వాళ్లు మోసం చేశారు. చెక్‌ డిస్‌అలో చేశారు. చెక్‌ రాగానే ఫోటో తీసి పూర్తి వివరాలతో సహా మీకు త్వరలోనే వెల్లడిస్తా. ఇకపై ల్యాండ్‌ కొనేటప్పుడు ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండండి. భూమి కొనేముందు రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరి అథారిటీ(రెరా) నిబంధనలు తప్పనిసరిగా తెలుసుకుని ల్యాండ్‌ కొనండి. ఎవరి ట్రాప్‌లో పడోద్దు" అంటూ ఆయన హెచ్చరించారు.


ప్రస్తుతం ఆయన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అంత పెద్ద స్టార్‌ అయినా ఆయనే మోసపోతుంటే ఇక సాధారణ ప్రజల పరిస్థితి ఏంటని నెటజన్లు రకరకాలుగ స్పందిస్తున్నారు. కాగా, జగపతిబాబు ప్రస్తుతం పాన్‌ ఇండియా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. చివరిగా ప్రభాస్‌ 'సలార్‌', మహేష్‌ బాబు 'గుంటూరు కారం‌' చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం సలార్‌ 2  షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. అలాగే మాస్‌ మహారాజా నెక్ట్స్‌ మూవీ 'మిస్టర్ బచ్చన్' మూవీ చేస్తున్నాడు. 


Also Read: అసెంబ్లీలోకి న‌ట సింహం, కొద‌మ సింహం... నందమూరి, కొణిదెల ఫ్యాన్స్‌కు కిక్కిచ్చేలా హైప‌ర్ ఆది స్పీచ్