టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత త్వరలోనే హాలీవుడ్లో సినిమా చేయబోతుందట. రీసెంట్ ఆమె చేసిన ఓ పని ఈ వార్తకి మరింత బలం చేకూర్చింది.  అసలు మ్యాటర్ లోకి వెళ్తే.. సమంతా ఇటీవల అమెరికా టూర్‌కు వెళ్లిన విషయం తెలిసిందే కదా. 'ఖుషి' మూవీ షూటింగ్ పూర్తి చేసిన సామ్ రీసెంట్ గా అమెరికా వెళ్ళింది. అక్కడ వెకేషన్ ఎంజాయ్ చేసింది. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను తన సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది. నిజానికి సమంత అమెరికా వెళ్ళింది ట్రీట్మెంట్ కోసమని, మయోసైటిస్ వ్యాధికి సంబంధించి అమెరికాలోనే సమంత కొన్ని నెలల పాటు ట్రీట్మెంట్ తీసుకోబోతున్నట్లు కూడా వార్తలు వచ్చాయి.


ఈ క్రమంలోనే సమంత అమెరికాలో ఉన్న పలు ప్రదేశాలను సందర్శించింది వాటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది. అయితే తన అమెరికా టూర్ లో భాగంగా సమంత రీసెంట్ గా హాలీవుడ్ ప్రొడక్షన్ హౌజ్ వార్నర్ బ్రదర్స్ స్టూడియోస్ ని సందర్శించింది. అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియాలో పంచుకుంది. వార్నర్ బ్రదర్స్ స్టూడియోస్ తో పాటు కాలిఫోర్నియాలోని బెవెర్లీ హిల్స్ వీధుల్లో సైతం చక్కర్లు కొడుతూ కనిపించింది. అయితే సమంత సందర్శించిన ఈ ప్రాంతాలన్నీ హాలీవుడ్ సంబంధిత ప్రదేశాలు కావడంతో సమంత హాలీవుడ్ మూవీ చేస్తుందనే వార్త ఒక్కసారిగా వైరల్ అయింది.


అంతేకాదు హాలీవుడ్ ఆఫర్స్ కోసమే సమంత అమెరికా వెళ్లిందని చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఆమె పలు హాలీవుడ్ స్టూడియోస్ లో పాత్రల కోసం ఆడిషన్ కూడా ఇస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. మరి సమంత నిజంగానే హాలీవుడ్ ఆఫర్స్ కోసం అమెరికా వెళ్లిందా? లేక వెకేషన్ లో భాగంగా ఇదంతా జరిగిందా? అనే దానిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. ఇక మరోవైపు సమంత నటించిన 'ఖుషి' మూవీ రిలీజ్ కు రెడీ అవుతోంది. సమంతకి జోడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమాని శివ నిర్వాణ డైరెక్ట్ చేశారు. సెప్టెంబర్ 1న తెలుగుతోపాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా విడుదలవుతోంది. ఈ క్రమంలోనే మూవీ టీం ఇప్పటికే ప్రమోషన్స్ ని వేగవంతం చేశారు.


చిత్ర యూనిట్ తో పాటు సమంత కూడా రీసెంట్ గా ప్రమోషన్స్ కి హాజరైంది. విజయ్, సమంత ప్రస్తుతం వరుస ఇంటర్వ్యూస్ లో పాల్గొంటున్నారు. ఇప్పటికే సినిమా నుండి విడుదలైన సాంగ్స్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. అలాగే టైలర్ కూడా సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ  రూపొందించిన ఈ సినిమాతో ఎలాగైనా మంచి కం బ్యాక్ ఇవ్వాలని అటు విజయ్ దేవరకొండ ఇటు సమంత ఇద్దరూ అనుకుంటున్నారు. ఎందుకంటే ఈ ఇద్దరి గత చిత్రాలు 'లైగర్', 'శాకుంతలం' బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్ గా నిలిచాయి. దీంతో ఫ్యాన్స్ కూడా వీళ్ళిద్దరి కం బ్యాక్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి రొమాంటిక్ లవ్ డ్రామాగా రాబోతున్న 'ఖుషి' బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.


Also Read : ఐకాన్ స్టార్‌కు ఇన్‌స్టాగ్రామ్ అరుదైన గుర్తింపు - మార్నింగ్ రొటీన్‌ to ‘పుష్ప’ సెట్స్ వరకు, వీడియో అదుర్స్ అంతే!



Join Us on Telegram: https://t.me/abpdesamofficial