Rajinikanth And Kamal Haasan : సౌత్ ఇండియన్ సినిమా లెజెండ్స్ అయిన రజనీకాంత్, కమలహాసన్ ఒకే చోట కలుసుకోవడం అభిమానుల్ని ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ ఇద్దరు సీనియర్ హీరోలు ఒకే ఫ్రేమ్ లో ఉన్న ఫోటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇంతకీ కమల్, రజిని ఒకే చోట కలుసుకోవడానికి కారణం ఏంటి? వివరాల్లోకి వెళ్తే.. రజనీకాంత్, కమలహాసన్ ఇద్దరూ వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్నారు. తమ సెకండ్ ఇన్నింగ్స్ లోనూ అగ్ర హీరోలతో పోటీపడి మరి సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం రజనీకాంత్ తన 170వ సినిమాలో నటిస్తుండగా.. కమల్ శంకర్ దర్శకత్వంలో 'ఇండియన్ 2'(Indian 2) చేస్తున్నారు.


సుమారు 21 ఏళ్ల తర్వాత ఈ ఇద్దరు హీరోలు ఒకే చోట కలుసుకోవడం సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఈ సందర్భంగా ఒకరినొకరు ఎంతో ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. అసలు విషయం ఏమిటంటే, 'ఇండియన్ 2'(Indian2) కోసం కమలహాసన్, తలైవార్ 170(Thalaivar) కోసం రజనీకాంత్ చెన్నైలోని ఓ స్టూడియోలో కలుసుకున్నారు. ఒకే సమయంలో ఒకే స్టూడియోలో వీరిద్దరి సినిమా షూటింగ్స్ జరగడం విశేషంగా మారింది. ఇక స్టూడియోలో కలుసుకున్న రజనీకాంత్, కమలహాసన్ ఒకరినొకరు మర్యాదపూర్వకంగా ప్రేమగా పలకరించుకున్నారు.


సుమారు 21 ఏళ్ల తర్వాత ఈ అరుదైన మూమెంట్ చోటు చేసుకోవడంతో ఇది చూసిన అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. దీంతో ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ చేస్తున్నారు. సరిగ్గా 21 ఏళ్ల కింద కమల్ హాసన్, రజనీకాంత్ ఒకే స్టూడియోలో కలిశారు. రజనీకాంత్ 'బాబా', కమల్ హాసన్ 'పంచతంత్రం' సినిమా షూటింగ్స్ చెన్నైలో ఒకే ప్లేస్ లో జరిగాయి. ఆ తర్వాత మళ్ళీ ఇన్నాళ్లకు ఆ క్రేజీ మూమెంట్ వచ్చింది. దీంతో ఫ్యాన్స్ వాళ్ళిద్దరిని ఒకే ఫ్రేమ్ లో చూసి తెగ మురిసిపోతున్నారు.


ఇక రీసెంట్ గా 'జైలర్'(Jailer) మూవీతో భారీ విజయాన్ని అందుకున్నారు రజినీకాంత్(Rajinikanth). అటు కమల్ హాసన్(Kamal Haasan) గత ఏడాది లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన 'విక్రమ్'(Vikram) మూవీతో బ్లాక్ బాస్టర్ హిట్ ని సొంతం చేసుకున్నారు. ఇక 'తలైవార్ 170'(Thalaivar170) ప్రాజెక్ట్ విషయానికి వస్తే.. TJ జ్ఞానవెల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుభాస్కరన్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ అమితాబచ్చన్, ఫాహద్ ఫాజిల్, దగ్గుబాటి రానా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అటు కమల్ హాసన్ శంకర్ దర్శకత్వంలో 'ఇండియన్ 2' మూవీ షూటింగ్ తో బిజీగా ఉన్నారు. ఇటీవలే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.


Also Read : నేను కనీసం దోమల్ని కూడా చంపను, అది వాళ్ల కర్మకే వదిలేస్తున్నా: రేణు దేశాయ్ షాకింగ్ కామెంట్స్!


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply