Guntur Kaaram Censor Completed: సంక్రాంతికి దాదాపు అరడజను సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. అన్నింటికంటే ‘గుంటూరు కారం’పైనే ప్రేక్షకుల్లో ఎక్కువగా హైప్ క్రియేట్ అయ్యింది. ఇక మహేశ్ బాబు ఫ్యాన్స్ సైతం చాలాకాలం తర్వాత తమ అభిమాన హీరో మాస్ లుక్‌లో కనిపిస్తుండడంతో థియేటర్లలో రచ్చ చేయడానికి సిద్ధమయ్యారు. ‘గుంటూరు కారం’ నుంచి వస్తున్న ఒక్కొక్క అప్డేట్ ఫ్యాన్స్‌ను మరింత ఎగ్జైట్మెంట్‌లో ముంచేస్తోంది. అందుకే నిర్మాత నాగవంశీ సినిమాకు సంబంధించిన ప్రతీ ఒక్క అప్డేట్‌ను ట్వీట్ చేస్తూ ప్రేక్షకుల్లో మరింత హైప్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. తాజాగా మూవీకి సెన్సార్ పూర్తయిన విషయాన్ని కూడా నాగవంశీ ట్వీట్‌తో బయటపెట్టారు.


సెన్సార్ పూర్తి


మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో దాదాపు పదేళ్ల తర్వాత వస్తున్న సినిమా కావడంతో ‘గుంటూరు కారం’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే ఈ మూవీలో మహేశ్ బాబు రమణ పాత్రలో కనిపించనుందని మేకర్స్ బయటపెట్టారు. అంతే కాకుండా ఇప్పటివరకు విడుదలయిన ప్రతీ పోస్టర్, ప్రతీ పాట ప్రేక్షకుల అంచనాలకు మించేలాగానే ఉన్నాయి. తాజాగా ఈ మూవీ సెన్సార్ కూడా పూర్తి చేసుకొని యూ/ఏ సర్టిఫికెట్‌ను సంపాదించుకుంది. ఈ విషయాన్ని నిర్మాత నాగవంశీ ట్విటర్‌లో షేర్ చేశారు. దాంతో పాటు మహేశ్ బాబు రెడ్ షర్ట్ వేసుకొని బీడీ తాగుతున్న మరో ఫోటో కూడా ట్వీట్ చేస్తూ ఆడియన్స్‌ను సిద్ధంగా ఉండమని సిగ్నల్ ఇచ్చాడు.


డేట్ గుర్తుపెట్టుకోండి


‘చూడగానే మజా వస్తుంది. హార్ట్ బీట్ పెరుగుతుంది. ఈల వేయాలి అనిపిస్తుంది. బ్లాక్‌బస్టర్ బొమ్మ లోడింగ్. జనవరి 4 డేట్ గుర్తుపెట్టుకోండి’ అంటూ యూ/ఏ సర్టిఫికెట్ గురించి బయటపెట్టారు నాగవంశీ. మరోసారి జనవరి 12న ‘గుంటూరు కారం’ రిలీజ్ ఉంది అంటూ గుర్తుచేశారు. ఇప్పటికే మూవీ గురించి మహేశ్ ఫ్యాన్స్‌తో ముచ్చటించి వారి డౌట్లను క్లియర్ చేశారు. ‘గుంటూరు కారం’ టీమ్ అంతా ప్రమోషన్స్ కోసం ముందుకు వచ్చినా రాకపోయినా.. నాగవంశీ మాత్రం ఈ మూవీ ప్రమోషన్స్ కోసం కష్టపడుతున్నారు. ఇక ఈ మూవీ ట్రైలర్ జనవరి 6న విడుదలవుతుందని ఆయన అనౌన్స్ చేయడంతో ప్రస్తుతం మహేశ్ ఫ్యాన్స్ అంతా ఈ మూవీ కోసం ఎదురుచూస్తున్నారు.






ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు భారీ ఏర్పాట్లు..
‘గుంటూరు కారం’లో మహేశ్ బాబుకు జోడీగా శ్రీలీల, మీనాక్షి చౌదరి నటించారు. ఇప్పటికే శ్రీలీలతో రెండు పాటలు విడుదల కాగా.. మీనాక్షి చౌదరి ఫస్ట్ లుక్‌ను మాత్రం ఇన్నాళ్లకు రివీల్ చేసింది మూవీ టీమ్. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం భారీగా ఏర్పాటు మొదలయ్యాయని టాలీవుడ్‌లో వార్తలు వైరల్ అవుతున్నాయి. జనవరి 6న ట్రైలర్ రిలీజ్ చేయడంతో పాటు అదే రోజు ప్రీ రిలీజ్‌ను కూడా ఏర్పాటు చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. జనవరి 6 సాయంత్రం హైదరాబాద్‌లోని యూసఫ్‌ గూడ పోలీస్‌ గ్రౌండ్‌లో ఈ ప్రీ రిలీజ్‌ ఈవెంట్ ని నిర్వహించబోతున్నట్లు తెలిసింది. అయితే ఈ ఈవెంట్‌ను అమెరికాలో ఉండే ఫ్యాన్స్ కూడా లైవ్ చూసే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని సమాచారం. 


Also Read: 'గుంటూరు కారం' ట్రైలర్ వచ్చేస్తోంది - గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్, ఎప్పుడంటే?