సత్యదేవ్ (Sathyadev) కథానాయకుడిగా నటించిన సినిమా 'గాడ్సే' (Godse Movie). వేసవిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మే 20వ తేదీన సినిమాను (Godse Movie Release date) విడుదల చేయనున్నట్లు ఈ రోజు వెల్లడించారు. సీకే స్క్రీన్స్ పతాకంపై సి. కల్యాణ్ (C Kalyan - Godse Movie) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


'బ్లఫ్ మాస్టర్' విజయం తర్వాత హీరో సత్యదేవ్, దర్శకుడు గోపీ గణేష్ పట్టాభి కాంబినేషన్‌లో రూపొందుతోన్న సినిమా 'గాడ్సే'. ఇందులో ఐశ్వర్య లక్ష్మి  (Aishwarya Lekshmi) కథానాయికగా నటించారు. సత్యదేవ్‌ను పట్టుకోవాలని ప్రయత్నించే అధికారిగా ఆమె కనిపించనున్నారు. రాజకీయ నాయకుల అవినీతి ప్రధానాంశంగా ఈ సినిమా రూపొందినట్లు టీజర్ చూస్తే అర్థం అవుతోంది.


Also Read: 'బీస్ట్' రివ్యూ: సినిమా ఎలా ఉందంటే?






'గాడ్సే' టీజర్‌ను కొన్ని రోజుల క్రితమే విడుదల చేశారు. అందులోని ''ఏ నినాదం వెనుక ఎవరి ప్రయోజనాలు దాగి ఉన్నాయో తెలుసుకోలేనంత కాలం... ప్రజలు మోసపోతూనే ఉంటారు", "సాధారణంగా ఉద్యోగం చేస్తే డబ్బులు వస్తాయి. వ్యాపారం చేస్తే డబ్బులు వస్తాయి. వ్యవసాయం చేస్తే డబ్బులు వస్తాయి. కానీ, సేవ చేస్తున్నందుకు మీకు వందల వేల లక్షల కోట్లు ఎలా వస్తున్నాయ్ రా! ఎందుకంటే... మీరంతా సర్వీస్ పేరుతో పబ్లిక్ మనీని లూటీ చేస్తున్నారు" అని సత్యదేవ్ చెప్పే డైలాగులు ఆలోచన రేకెత్తించే విధంగా ఉన్నాయి. 


Also Read: మోడీ ప్రభుత్వంపై మళ్ళీ తమిళ హీరో విజయ్ సెటైర్లు?