Double Ismart’s release likely to be delayed : టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఉస్తాద్ రామ్ కాంబినేషన్లో తెరకెక్కిన 'ఇస్మార్ట్ శంకర్' సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. రామ్ కెరియర్ లోనే ది బెస్ట్ మూవీస్ లో 'ఇస్మార్ట్ శంకర్' ఒకటి. ఇక ఈ సినిమా పాటలు అప్పట్లో ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. మణిశర్మ కంపోజ్ చేసిన మాస్ ఆల్బమ్ సినిమాకి హైలెట్ గా నిలిచింది. ఇక ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా 'డబుల్ ఇస్మార్ట్' తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. దర్శకుడిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు పూరీ జగన్నాథ్. తన సొంత బ్యానర్ పూరీ కనెక్ట్స్ ద్వారా చార్మీతో కలిసి ‘డబుల్ ఇస్మార్ట్’ను నిర్మిస్తున్నాడు.

 

మరోసారి ఈ సీక్వెల్ కి మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నాడు. రామ్ ఇప్పటివరకు తన కెరీర్‌లో నటించిన అన్ని సినిమాల్లోకంటే 'ఇస్మార్ట్ శంకర్' లోనే చాలా స్టైలిష్‌గా, డిఫరెంట్ లుక్‌తో కనిపించాడు. ఇక ఇప్పుడు 'డబుల్ ఇస్మార్ట్'లో కూడా తన లుక్స్ మరింత స్టైలిష్‌గా ఉంటాయని సమాచారం. ఈ సినిమాని లాంచ్ చేసిన రోజే రిలీజ్ డేట్ కూడా అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. శివరాత్రి కానుకగా మార్చి 8న 'డబుల్ ఇస్మార్ట్' ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. సినిమాని ఫాస్ట్ గా తీయడంలో స్పెషలిస్ట్ అయిన పూరి జగన్నాథ్ కచ్చితంగా అనుకున్న డేట్ కి సినిమాని రిలీజ్ చేస్తారని ఫ్యాన్స్ అనుకుంటున్న తరుణంలో ఈ సినిమా వాయిదా పడే అవకాశం ఉన్నట్లు లేటెస్ట్ ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది.

 

ఈ సినిమాకి సంబంధించి మరో 40 రోజుల షూటింగ్ పెండింగ్లో ఉందట. కాబట్టి తొందరపడి హడావిడి చేయడం కంటే ఎక్కడా క్వాలిటీ మిస్ కాకుండా ఆడియన్స్ కి థియేటర్స్ లో బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని పూరి జగన్నాథ్, రామ్ ఇద్దరు నిర్ణయించుకోవడంతో సినిమా రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు సినిమాని పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ప్రమోషన్స్ కూడా భారీ ఎత్తున చేయాల్సి ఉంటుంది. మార్చిలోనే రిలీజ్ చేయాలంటే వచ్చేనెల మూడో వారంలోపే షూటింగ్ పూర్తి చేయాలి. ఇక కచ్చితంగా ప్రమోషన్లకు నెల రోజులు పడుతుంది.

 

దానికి తోడు పూరీ జగన్నాథ్ 'లైగర్' డిజాస్టర్ తో డౌన్ ఫాల్ లో ఉన్నాడు. అటు రామ్ కూడా 'స్కంద' విషయంలో విపరీతమైన ట్రోలింగ్ ని చూసాడు. కాబట్టి ఈ ఇద్దరికీ 'డబుల్ ఇస్మార్ట్' ప్రాజెక్టు చాలా కీలకం. అందుకే తొందరపడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కాగా మార్చి నుండి మే నెలకి 'డబుల్ ఇస్మార్ట్' పోస్ట్ పోన్ కానునట్లు ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. త్వరలోనే మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇందులో రామ్ సరసన ఏ హీరోయిన్ నటిస్తుందనే విషయాన్ని ప్రస్తుతానికి మూవీ టీం సస్పెన్స్ గానే ఉంచింది.